DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సీనియర్ జర్నలిస్టు చారి మృతి తీరనిలోటు: ఎంపి భరత్ 

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జూన్ 02, 2021 (డిఎన్ఎస్):* సీనియర్ జర్నలిస్టు చారి మృతి జర్నలిజం రంగానికే కాకుండా వ్యక్తిగతంగా తనకు కూడా తీరనిలోటని రాజమహేంద్రవరం ఎంపి,  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ విప్ మార్గాని భరత్ రామ్ పేర్కొన్నారు. 

రాజమహేంద్రవరం నగరంలోని మార్గాని

ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపి కార్యాలయంలో బుధవారం చారి చిత్ర పటానికి ఎంపి భరత్ పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన సంతాప సభలో జర్నలిస్టు చారి తో ఆయనకున్న సాన్నిహిత్యం గుర్తుచేసుకున్నారు. 

రాజమహేంద్రవరం నగరాభివృద్ధి విషయంపై తనతో తరచూ

చర్చించేవారన్నారు. 

పది రోజుల క్రితమే నాన్నగారు అనారోగ్యంతో బాధపడుతున్నారని చారి గారి కుమార్తె ఫోన్ చేసి చెబితే వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించేందుకు ఏర్పాటు చేశానని చెప్పారు.

అయితే మరో హాస్పిటల్ లో చేరిన విషయం చారి మృతి తర్వాత గాని తెలియలేదన్నారు. 

ఒక గురువు

మాదిరిగా మంచి సలహాలు ఇచ్చేవారని అన్నారు. 

ఈ సందర్భంగా చారి  పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ఎంపి భరత్ రామ్ తెలియజేశారు. 

ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్ధిక సహాయాన్ని ఈ సందర్భంగా చారి కుటుంబ సభ్యులకు ఎంపి భరత్ రామ్ అందజేశారు. 

తన

వంతు సహాయాన్ని కూడా త్వరలో అందజేస్తానని ఎంపి తెలిపారు. కార్యక్రమంలో ఎపియు డబ్ల్యుజే రాష్ట్ర కార్యదర్శి మండేలా శ్రీ రామ మూర్తి, పార్లమెంటరీ జిల్లా వైసీపీ అధికార ప్రతినిధి సాగర్ తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam