DNS Media | Latest News, Breaking News And Update In Telugu

త్రిశంకు స్వర్గంలో ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ 

*7 నుంచి ఆనందయ్య మందు పంపిణీ, ప్రభుత్వం ప్రకటన*
 
*మందు పంపిణీ ఉండదంటూ కొందరు వీడియోలు విడుదల*

*ఇంతకీ 7 నుంచి ఆనందయ్య మందు ఇస్తారా లేదా చూడాలి* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 05, 2021 (డిఎన్ఎస్):* ఎన్నో బాలారిష్టాలు దాటుకుని, ప్రజల ముంగిటకు వస్తుంది అనుకున్న కృష్ణపట్నం

ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీ ప్రక్రియ ప్రస్తుతం త్రిశంకు స్వర్గంలో ఉంది. 
ఈనెల 7 నుంచి కృష్ణపట్నంలోనే ఆనందయ్య మందు పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియా లో అధికార పార్టీ పేజ్ లో ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ పంపిణీ ఆనందయ్య చేసుకునే విధంగానే ఉంటుందన్నారు. దీంతో ప్రజల్లో

ఆనందం వెల్లువిరిసింది. 

అయితే ఆనందయ్య కుటుంబ సభ్యులు, సహాయకులు పేరిట సోషల్ మీడియా కొన్ని వీడియోలు విడుదల అయ్యాయి. దీని సమాచారం ప్రకారం ఆనందయ్య మందు పంపిణీ 7 వ తేదీ సోమవారం నుంచి జరగదని, ప్రకటించారు. ప్రభుత్వం నామ మాత్రపు ప్రకటన చేసిందని, అయితే ఇక్కడ అందుబాటులో ఉన్న సామాగ్రి ప్రకారం రోజుకు కేవలం 5

వేలమందికి మాత్రమే మందు ఇవ్వగలమని తెలిపారు. పైగా ప్రభుత్వం ఈ ప్రాంతంలో 144 సెక్షన్ విధించిందని, ప్రజలు వచ్చే అవకాశం లేదన్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలకు మందు ఇవ్వం అని ప్రకటించేసారు. 

మందు కావలిసిన వారు నేరుగా ప్రభుత్వాన్నే అడగాలని, లేదా మీ స్థానిక ప్రజా ప్రతినిధిని అడగాలని ప్రకటించారు. తమకు అడ్డంకులు

కల్పిస్తే మందు పంపిణీ ఎలా జరుగుతుందన్నారు. 

ఆనందయ్య మందు పంపిణీ పూర్తిగా ఉచితమేనని, ఎవ్వరికి ఎటువంటి డబ్బులు, ఫీజులు ఇవ్వనవసరం లేదన్నారు. అయితే కొందరు ఆన్లైన్ లో మందు పంపించాలంటే రూ. 15 రవాణా ఫీజు కట్టాలి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. అసలు ఆన్ లైన్ లో మందు పంపిణీ ఇవ్వం అని తేల్చి చెప్పేసారు.

కేవలం తమ కేంద్రానికి వచ్చిన వారికే మంచు ఉచితంగా ఇస్తామన్నారు. 

ప్రభుత్వ ప్రతిబంధకాలు తొలిగితే తప్ప మందు పంపిణీ జరగదని, మందు కావాల్సిన వారు నేరుగా ప్రభుత్వాన్ని, మీ ప్రజా ప్రతినిధులను అడగాలన్నారు. వాళ్ళు ముందుకు వస్తే . .ఈ అడ్డంకులు తొలుగుతాయన్నారు. 

అయితే ఈ వీడియోల్లో ఎక్కడా ఆనందయ్య

మాట్లాడినట్టు గా ఎక్కడా లేదు. దీనిపై అందరిలోనో ఆందోళన నెలకొంది. 

ఆనందయ్య ఆయుర్వేద మందు: .. 

కొరోనా మహమ్మారి నుంచి కాపాడుతోంది అనే ప్రచారం జరగడం తో పాటు, సుమారు 70 వేలమందికి మందు పంపిణీ చేయడం నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య పేరు ఒక్కసారిగా సమాజం ముంగిటకు వచ్చింది. దీంతో లక్షలాదిగా ప్రజలు

కృష్ణపట్నం చేరుకోవడంతో మందు పంపిణీ పై నిజాలు నిగ్గు తేల్చాలి అని కొందరు కోర్టులో కేసులు వేశారు. సుమారు నెలరోజుల పాటు తర్జన భర్జన పడిన తర్వాత మందు లో ఎటువంటి విష పదార్ధాలు లేవని కేంద్రం పంపిన వైద్య నిపుణులు తేల్చారు. అయినప్పడికి రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి చూపి, మందు పంపిణీ కి అనుమతి నిరాకరించడం తో,  మందు పంపిణీ

పై ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ప్రభుత్వానికి చీవాట్లు పెట్టి, మందు పంపిణీకి ఆనందయ్య కు అనుమతి ఇచ్చింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam