DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శాస్త్రోక్తంగా సంపత్ వినాయక గుడిలో ధన్వంతరి హోమం  

*కొరోనా కట్టడి కోసం ఆలయంలో హోమం: ఏసీ శాంతి* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 08, 2021 (డిఎన్ఎస్):*  కరోనా మహమ్మారి విజృంభిస్తున్నటువంటి ఈ విపత్కర పరిస్థితులలో కరోనా వ్యాప్తి నివారణకు ప్రజలను కరోనా మహమ్మారి బారి నుండి రక్షించుటకు విశాఖపట్నం, ఆశీలమెట్ట, శ్రీ సంపత్ వినాయగర్ దేవస్థానము

లో ధన్వంతరి, మృత్యుంజయ హోమం నిర్వహించిన్నట్టు దేవాలయ  కార్యనిర్వాహణ అధికారిణి,  విశాఖపట్నం సహాయ కమిషనర్, శాంతి కాళింగిరి తెలియచేసారు. 

విశాఖనగరంలోనే అత్యంత ప్రసిద్ధికెక్కిన ఈ దేవాలయంలో భక్తుల సంరక్షణార్థం ఆంధ్రప్రదేశ్ దేవదాయ ధర్మాదాయ శాఖ ఉన్నతాధికారుల అదేశముల మేరకు ఉదయం 7 గంటలనుండి  9 గంటలవరకు

ధన్వంతరి, మృత్యుంజయ హోమం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఏకాంతముగా నిర్వహించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో భక్తులoదరూ పరోక్షంగా ఈ కార్యక్రంలో పాల్గొనుటకు సోషల్ మీడియా ద్వారా ప్రసారం చేయడం జరిగిందన్నారు.  

ఆలయ ప్రధాన అర్చకులు  మోహన్ స్వామి  ఆధ్వర్యంలో వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఫౌండర్ ఫ్యామిలీ

మెంబర్  టీ. ఆర్. చోళన్ తదితరులు పాల్గొన్నారు

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam