DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖలో అర్చక పురోహితులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

*ద్రోణంరాజు జ్ఞప్తిగా వైజాగ్ బ్రాహ్మిణ్ వెల్ఫేర్ సొసైటీ నిర్వహణ*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 10, 2021 (డిఎన్ఎస్):*  విశాఖపట్నం 1 టౌన్ జగన్నాధస్వామి ఆలయంలో విఎంఆర్ డీఏ ప్రధమ చైర్మన్, దివంగత ద్రోణంరాజు శ్రీనివాసరావు జ్ఞాపకార్ధం వైజాగ్ బ్రాహ్మిణ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో

నిరుపేద అర్చకులకు, పురోహితులకు నిత్యవసర సరుకుల మరియు పండ్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం సంఘం  గౌ అధ్యక్షులు టి ఎస్ ఆర్ ప్రసాద్ పర్యవేక్షణలో కరోనా సమయంలో ఇబ్బంది పడుతున్న వారందరికీ నాల్గవ దఫా నిత్యవసర సరుకుల మరియు పండ్లు పంపిణీ చేపట్టారు. ద్రోణంరాజు శ్రీనివాస్ తనయుడు, యువనేత ద్రోణంరాజు శ్రీవత్సవ్

చేతులమీదుగా జరిగింది. 
ఈ కార్యక్రమంలో వైజాగ్ బ్రాహ్మిన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు కావురు చరణ్ కుమార్, లక్ష్మీ కన్నతల్లి, కె. రాంభద్రుడు, శంకర్ నీలు, విప్పాని మురళీకృష్ణ, ఆలయ ప్రధాన అర్చకులు  జగన్నాదాచార్యులు, ఆనంతాచార్యులు, టి ఎస్ కె అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇలాంటి కష్ట సమయంలో సహాయం చేసినందుకు

గాను పండితులంతా సంతోషం వ్యక్తంచేసి శ్రీవత్సవ్ ని ఆశీర్వదించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam