DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోక రక్షణార్థం పెందుర్తి వేంకటాద్రి పై సుదర్శన హోమం

*శాస్త్రోక్తం గా ఆలయ అర్చకులు రామానుజం నిర్వహణలో. ..*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 14, 2021 (డిఎన్ఎస్):* ప్రపంచాన్ని అవస్థలకు గురిచేస్తున్న కొరోనా రాక్షసుని బారి నుంచి మానవాళిని రక్షించమని లోక రక్షణార్థం సంకల్పంతో విశాఖ నగరంలోని పెందుర్తి లోగల వేంకటాద్రి శ్రీవెంకటేశ్వర స్వామి

ఆలయంలో సుదర్శన హోమం వైభవంగా నిర్వహించారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో  శాస్త్రోక్తంగా ఆలయ ప్రధాన అర్చకులు రామానుజం స్వీయ నిర్వహణలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమం 
తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రబంధ పారాయణదారులు, వేదపండితులు కాండూరి శ్రీనివాసాచార్యులు పర్యవేక్షణలో హోమం చేపట్టారు. అనంతరం రామానుజం

మాట్లాడుతూ ప్రస్తుతం ప్రజలందరూ కోరోనా మహమ్మారికి బలైపోతున్నారని, వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ప్రజలకు రక్షణ కలగడం లేదన్నారు. దీనికై లోకైక నాధుడు శ్రీవేంకటేశ్వరుని ప్రార్థిస్తూ సుదర్శన హోమం చేయడం జరిగిందన్నారు. 
ఇలాంటి పరిస్థితులలో, ఈ కష్టాల నుండి బైట పడటానికి,  యజ్ఞ యాగాదులు, హోమాలు, క్రతువులు

చేస్తే మంచిదని పురాణాలు చెపుతున్నాయన్నారు. 

ఈ ప్రస్తుత పరిస్థితులలో మనం  స్వామి కి ఎంత సేవ చేసుకుంటే అంత మంచిది.  జ్యేష్ఠ మాసం వచ్చేసిందని, అందరి క్షేమం కోసం మన స్వామి వారి సన్నిధిలో సుదర్శన హోమం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అర్చక కుటుంబ సభ్యులు, కొరోనా నిబంధనలు పాటిస్తూ భక్తులు మాత్రం

పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam