DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాహన మిత్రకు దేవాదాయ శాఖ నుంచి రూ. 49 లక్షల నిధులు

*బ్రాహ్మణా కార్పొరేషన్ కు సర్దుబాటు చెయ్యాలని సూచన.*  

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జూన్ 15, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాహన మిత్ర పథకానికి దేవాదాయశాఖ నుండి రూ.49 లక్షలను బదలాయింపు చేస్తూ  జీవో విడుదల అయ్యింది. ఈ నెల  14 న

విడుదలైన ఈ జీవో ప్రకారం ఈ మొత్తాన్ని వాహన మిత్ర పథకంకు 2250008001105900924 ఖాతాకు   బదలాయింపు జరిగింది.  దేవాదాయశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి డా. వాణిమోహన్ పేరిట విడుదలైన  జీఓ ఆర్టి 334 లో ఈ మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్  పిడి ఖాతా కు సర్దుబాటు చెయ్యాలని ఆదేశాలు ఇచ్చారు.  

G.O.Rt.No.1335, ఫైనాన్స్ (FMU - రెవెన్యూ)

విభాగం, తేదీ.  14-06-2021.  ** ఆర్డర్: పైన పేర్కొన్న సూచనలో జారీ చేసిన బడ్జెట్ విడుదల ఉత్తర్వులను అనుసరించి, ప్రభుత్వం దీని ద్వారా ప్రత్యేక ఎండోమెంట్స్ కమిషనర్, AP కి రూ .49,00,000 / (రూపాయలు నలభై తొమ్మిది లక్షలు మాత్రమే) కు పరిపాలనా అనుమతి ఇచ్చింది. 

అయితే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ నిధులను ఖర్చు చెయ్యాలంటే

కార్పొరేషన్ తీర్మానం చేయాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సంస్థ కు కేవలం చైర్మన్ తప్ప మరొకరు లేరు. ఎటువంటి కమిటీ కూడా లేదు. ఈ క్రమంలోనే ఈ నిధులు అత్యంత సునాయాసంగా తరలిపోయే అవకాశం ఉంది.  పైగా ప్రస్తుతం ఈ సంస్థలో ఎటువంటి పధకాలు అమలు లో లేవు. గత ఏడాది ఇవ్వవలసిన నిధులనే నేటికీ విడుదల చెయ్యక పోవడం గమనార్హం. 

దేవాదాయ శాఖ

కేవలం హిందూ ధార్మిక సంస్థల్లోనూ, ఆలయాల్లో హిందువు భక్తులు వేసే ముడుపులు, విరాళాల నుంచి వచ్చే నిధులతో మాత్రమే నడుస్తోంది. ఈ శాఖకు ప్రభుత్వం నుంచి ఎటువంటి మార్గాల్లోనూ నిధులు రావు. పైగా ఈ శాఖ కేవలం హిందువులకు మాత్రమే సంబంధించినది, అలాంటిది ఈ శాఖ నుంచి ప్రభుత్వ పథకాలకు నిధులు ఎలా తరలిస్తారు అని  ధార్మిక సంఘాలు

మండిపడుతున్నాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam