DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొరోనాతో మృతి చెందిన వారికి ఉత్తమగతులు కోసమే వైభవేష్టి నిర్వహణ

*అంత్యక్రియలు కూడా సక్రమంగా జరగని వారికోసమే ఈ హోమం*

*చిన్న జీయర్ స్వామి సూచనతో శ్వాస్ శ్రీవైష్ణవ బృందం నిర్వహణ*

*అందరికీ పిండ ప్రదానం చేసిన తర్వాతే రోజూ పూర్ణాహుతి నిర్వహణ*

*కుల, మతాలకు అతీతంగా అందరికోసం హోమం: దేవనాద జీయర్*

*మీవాళ్ళ వివరాలను వాట్సాప్ లో పంపండి, హోమం చేస్తాం:

శ్వాస్*  

*వాట్సాప్ నంబర్స్: 9502777196,  9440328807, 9885585153*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం /హైదరబాద్ , జూన్ 17, 2021 (డిఎన్ఎస్):* ప్రపంచాన్ని ఇబ్బంది పెడుతున్న కొరోనా రాక్షసుని బారిన పది అకాల మృతి చెందిన వారందరికీ (ఏ మతం, జాతి, సంప్రదాయం వారైనప్పడికి)  ఉత్తమ గతులు కలిగించాలని అనే సంకల్పం తో అపర

రామానుజులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి చేసిన సంకల్పం కు అనుగుణంగా శ్రీవైష్ణవ ఆగమ సంప్రదాయ సేవా సమితి ( శ్వాస్)  పండితులు శాస్త్రోక్తంగా వైభవేష్టి ని నిర్వహిస్తున్నారని  ప్రముఖ ఆధ్యాత్మికవేత్త త్రిదండి దేవనాధా రామానుజ జీయర్ స్వామి విచ్చేసారు. గత నాలుగురోజులుగా హైదరాబాద్ జెట్ శ్రీ వేంకట

నిలయం భవనంలో శాస్త్రోక్తంగా జరుగుతున్న  వైభవేష్టి హోమ ప్రక్రియ ను నిర్వహిస్తున్న వేదపండితులును, సహచరులకు మంగళాశాసనం చేసేందుకు గురువారం స్వామి విచ్చేసారు.  ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన మృతి చెందిన వారికి అంత్యక్రియలు కూడా సక్రమంగా జరగకపోవడం చాలా బాధాకరం అన్నారు. కుటుంబ సభ్యులు కూడా దూరం

నుంచే చివరి చూపు చూడవలసి రావడం మరింత దుఃఖాన్ని కల్గించిందన్నారు. అయితే వీరందరికీ ఉన్నత లోకాలు ప్రాప్తించి భగవద్ సాన్నిధ్యం పొందే విధంగా ఉత్తమగతులు లభించాలని, చాలా మంది కుటుంబాలలో ఆప్తులను, బంధువులను కోల్పోయి నిరుత్సాహంతో ఇబ్బంది పడుతున్న భక్తులకు ధైర్యాన్ని అందించటానికి, శ్రీ పాంచరాత్ర ఆగమానుసారం వైభవేష్టి

హోమం చెయ్యాలి అని  చిన్న జీయర్ స్వామి చేసిన సంకల్పం కు అనుగుణంగా  శ్వాస్ మహోన్నతమైన వైదిక కార్యక్రమాన్ని పూర్తిగా ఉచితంగానే నిర్వహించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు.  

ఈ నెల 14 నుంచి 18 వరకూ వరుసగా ఐదు రోజుల పాటు ఈ వైభవేష్టి జరుగుతుందని, అందరూ ప్రత్యక్షంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లేనందున

ఈ కొరోనా బారిన పడి అకాల మరణం పొందిన వారి పేరు, గోత్రం వివరాలను తమ వాట్స్ అప్ నెంబర్ కు పంపాలని కోరుతున్నారు. ప్రతి రోజు ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకూ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని సోషల్ మీడియా ద్వారా లైవ్ లో ప్రసారం చేస్తున్నట్టు తెలిపారు. 

కరోనా కారణంగా మరణించినవారి  గోత్ర

నామాలు  ఈ వాట్సాప్ (95027 77196 ,  94403 28807 , 9885585153 ) నంబర్స్ కి తెలియపరిస్తే, అందరి పేర్లతో హోమం జరుపబడుతుందని, తెలియచేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam