DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్చకులు ఆలయ మూలవిరాట్ కే సేవకులు, కమిటీలకు కాదు 

*హిందూ దేవాలయాల నిర్వహణ లో అర్చకుల పాత్ర ఏంటి?*

*అర్చకులకు వాక్కు శుద్ధి అవసరం, నియమాలు తప్పని సరి* 

*ఆస్తులు ఆక్రమణలవుంటుంటే కమిటీలనైనా ఎదిరించాలి* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 23, 2021 (డిఎన్ఎస్):* హిందూ దేవాలయాల్లోని అర్చకులు ఆలయ మూలవిరాట్ కే సేవకులు,

కమిటీలకు కాదు. అయితే నేడు ఆలయాల్లో ఆ నిబంధనలకు పూర్తిగా తిలోదకాలిచ్ఛేసి, మూలవిరాట్ కంటే కమిటీలే కీలకంగా మారిపోయాయి. ఈ విధానం మారితే తప్ప ఆలయాలకు పూర్వ వైభవం రాదు. 
ఆలయాలు సమాజానికి మూల జీవనాధారం. ఆలయాల్లో ఆగమవిధానం ప్రకారం వేదస్వరాలు, అర్చనలతో పూజాది వైదిక కార్యక్రమాలు నిర్వహించబడితే. . ఆ వేదస్వరాలు నాద

తరంగాలు గా వాతావరణం లో విస్తరించి మానవాళి మనుగడకు మార్గాలుగా మారతాయి. ఆలయాలు ఈ విధంగా వైభవంగా సాగాలి అంటే వాటిని సక్రమంగా నిర్వహించవలసింది ఆలయాల్లోని అర్చకులే. 

వీళ్ళు వైదిక పరమైన ఆరాధనలో పాల్గొనాలి అంటే. . కచ్చితంగా వాళ్ళు ఆలయ, ఆగమ నిబంధనలు పాటించాల్సిందే. అర్చకుల్లో ఏ సామాజిక వర్గం వారు ఉన్నా వాక్కు

శుద్ధి ఉండాలి. అవి ఉండాలి అంటే మద్యం, మాంసాదులను ముట్టుకోరాదు. తద్వారా స్వరం లో అక్షరాలు తప్పులు ద్రోల్లరాదు. వీటిని సక్రమంగా చూసుకోవాల్సిన బాధ్యత అర్చకుల పైనే ఉంది. 

అర్చకుల వాక్కు స్వచ్చంగా ఉండి, అర్చనాదికాలు పద్దతిగా నిర్వహిస్తే. . .ఆలయాలు వైభవంగా వెలుగొందుతాయి. తద్వారా భక్తులు రాక పెరిగి, ఆదాయవనరులు

పెరుగుతాయి. ఆలయ అభివృద్ధితో పాటు, అర్చక కుటుంబాలు కూడా సంతోషంగా జీవనం సాగిస్తాయి. 

ఆలయాల నిర్వహణ కోసం, ధూప దీప నైవేద్యాలు, అర్చకుల పోషణ కోసం ఎందరో దాతలు భూరి విరాళాలు ఇవ్వడం జరిగింది. వాటిని అసాంఘిక శక్తులు, ఆలయ కమిటీల పేరుతొ అందిన కాడికి దోచుకుతింటున్నాయి. కోట్లాది నిధులు viluva చేసే ఆస్తులు ఉన్న వేలాది

దేవాలయాలు ఎందరో దోచుకోగా కాలక్రమేణా నేడు ఆస్తులన్నీ కరిగి పోయి, అప్పుల ఊబిలో కూరుకు పోయాయి. 

వీటికి కారణం దేవాలయాల ఆస్తుల రక్షణలో అర్చకులు కొంత నిర్లక్ష్యంగా ఉండడం కూడా కారణమే. దేవాలయాల ఆస్తులు దోచుకుంతినేవాళ్ళు ఆలయ కమిటీలైనా సరే ఎదిరించి నిలబడాల్సిన అవసరం అర్చకులపై ఉంది. అర్చకులు ఎదిరిస్తే . .

అర్చకులకు అండగా భక్తులు కూడా సంఘీభావం తెలియచేస్తారు. 
అర్చకులు కేవలం గర్భాలయంలోని మూలవిరాట్ కు మాత్రమే సేవకులు, ఆలయ కమిటీలకు కాదు అనే విషయం ఇటు అర్చకులు, అటు ఆలయ కమిటీలు కూడా గుర్తుపెట్టుకుని పని చేస్తే ఆలయాలు పూర్వ వైభవాన్ని పొందుతాయి. తద్వారా సమాజ  శ్రేయస్సు కలుగుతుంది.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam