DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దివ్య ప్రబంధానికి అక్షర రూపం ఇచ్చిన వారు నాథమునులే

*వైష్ణవ సంప్రదాయంలో ఆద్యులు నాథమునులు,*  

*కణ్ణినుణ్ శిరుత్తంబు చదివితే ప్రబంధం అందింది*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 23, 2021 (డిఎన్ఎస్):* శ్రీవైష్ణవ సంప్రదాయంలో  "లక్ష్మినాథ సమారంభం నాథయా ముని మధ్యమామ్, అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం" అనే పాశురం వినని వారు

ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఇందులో నాథ మునులు అనే వారి గురించి ప్రస్తావించబడింది. ఆయన తిరునక్షత్రం ( జన్మదినం బుధవారం) సందర్భంగా వారు ఈ సమాజానికి అందించిన మహోన్నత సంపద గురించి తెలుసుకుందాం.   

శ్రీవైష్ణవ సంప్రదాయంలో ప్రతి ఒక్కరూ తప్పని సరిగా అనుసంధానం చేయవలసిన ప్రబంధం నాలాయిర దివ్య ప్రబంధం. ఇది 12 మంది

ఆళ్వార్లు శ్రీమన్నారాయణుని కీర్తించిన 4000 పాశురాల సమాహారం. దీన్ని ప్రస్తుత సమాజానికి అందించిన వారు శ్రీ నాథమునులు. ప్రతి శ్రీవైష్ణవ ఆలయంలోనూ, శ్రీవైష్ణవ కుటుంబంలోనూ అనునిత్యం అనుసంధానించే నాలాయిర దివ్య ప్రబంధమును ఈ లోకానికి అందించిన వారు ఈయనే. పన్నిద్దరు ఆళ్వార్లు వివిధ ప్రాంతాల్లోని వివిధ ఆలయాల్లో వెలసిన

శ్రీమన్నారాయణుని కీర్తించిన 4000 పాశురాలను సేకరించి, తమిళభాషలో నాలాయిర దివ్య ప్రబంధముగా క్రోడీకరించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న గ్రంధం ఇదే. శ్రీ వైష్ణవ ఆచార్యులలో మొదటి వ్యక్తిగా పరిగణించబడుతున్న నాథముని యోగరహస్య, న్యాయత్వత్వాన్ని రచించారు.

నాథ మునులు (క్రీ.శ. 823 – క్రీ.శ. 951) ప్రాంతంలో నివసించినట్టు

చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అసలు పేరు అరంగనాథన్, అయితే నాథముని అని పిలుస్తారు. కాటుమన్నార్ కోయిల్ సమీపంలోని వీరనారాయణ పురంలో జన్మించారు. తండ్రి పేరు ఇవర భట్ట, కొడుకు పేరు ఇవరముని, ఈయన మనవడు యమునాచార్యులు. 

నాలాయిర ప్రబంధ ఆవిర్భావం : . .. 

నాథ మునులు  నాలాయిర దివ్య ప్రభావం గురించి తెలుసుకొని,

అందులో 10 శ్లోకాలు మాత్రమే విన్నారు. ఆళ్వార్లలో అత్యంత ప్రసిద్ధులైన నమ్మాళ్వార్లను ప్రశంసిస్తూ కన్నినున్ శిరుత్తామ్బు అనే 12 పాశురాలు కల్గిన గ్రంధాన్ని 12000 సార్లు పఠించారు. వెంటనే నమ్మాళ్వార్లు  దర్శనమిచ్చి నాలాయిర ప్రబంధాన్ని అందించారు. దీనికి లిఖిత పూర్వక సందర్శనం కల్పించారు నాథమునులు.  అదే నేటికి అందరికీ

అందుబాటులో ఉంది.  

శ్రీరంగంలో తన ఇద్దరు మేనల్లుళ్ళకు శ్లోకాలు నేర్పించడంతో పాటు, అతను శ్రీరంగంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలోని శ్రీరంగస్వామి సేవచేస్తూ, ఆలయ నిర్వాహకుడిగా ఉన్నారు. అనంతర కాలంలో భగవద్రామానుజులు ఈ రచనలకు విస్త్రత ప్రచారం కల్పించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam