DNS Media | Latest News, Breaking News And Update In Telugu

చంద్రగ్రహణం ప్రభావం పడకుండా ఆలయాలు మూసివేత 

విశాఖపట్నం, జులై 27, 2018 (DNS Online ): దేవాలయ ఆగమ విధానాల ప్రకారం చంద్రగ్రహణం ఫలిత ప్రభావం ఆలయాలపై చూపకుండా ఉండేందుకు రాష్ట్రం లోని అన్ని దేవాలయాలు మూసివేశారు. (ఒక్క శ్రీ

కాళహస్తి ఆలయం తప్ప). చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి ఆలయం లో రాహు కేతు పూజలు స్వామికి చెయ్యడం ఆనవాయితీ గా లభిస్తోంది.ఈ కారణం గా చంద్ర, సూర్య గ్రహణ ప్రభావం ఈ

ఆలయం పై ఉండదని, గ్రహణ సమయాల్లో ప్రత్యేక పూజలు ఆచరించడం జరుగుతోందని ఆలయ అర్చకులు తెలియచేస్తున్నారు. తిరుమల ఆలయం లోని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం

ఆనంద నిలయం, తదుపరి మహాద్వారం తలుపులు సాయంత్రం 5 గంటలకుమూసివేశారు. విశాఖపట్నం లోని సింహాచల క్షేత్రం ద్వారాలు మధ్యాహ్నం 1:30  à°—ంటలకు, శ్రీకనక మహాలక్ష్మి దేవాలయం

ఆలయాన్ని మధ్యాహ్నం 3 గంటలకు మూసివేశారు. ఇతర ఆలయాలు కూడా అంతరాలయం పూజలు చేసిన గ్రహణ సందర్భంగా మూసివేశారు. తిరిగి శనివారం ఉదయం ప్రత్యేక పుణ్యాహవచనం అనంతరం

భక్తులకు ఆయా మూలవరుల దర్శనాన్ని కల్పిస్తారు. 

pix: courtesy to whom so ever it may owns.

#dns #dnslive #dns news #lunar eclipse #visakhapatnam #vizag #TTD #tirumala #skml #kanaka mahalakshmi #temples #eclipse

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam