DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాలు, ఆగమాలని హేళన చేస్తే చర్యలు తప్పవు :శ్రీవైష్ణవ సంఘం 

*అఖిలభారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంఘం హెచ్చరికలు.*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 25, 2021 (డిఎన్ఎస్):* హిందూ దేవాలయాలను, అక్కడ జరిగియే ఆగమోక్త అర్చన విధానాలను అవహేళన  చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అఖిల భారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంఘం హెచ్చరికలు జారీచేసింది. ఇటీవల సింహాచల

క్షేత్రంలో జరిగిన గరుడ ధ్వజం వద్ద జతులు పాడిన అర్చకుని వీడియో ను మార్ఫింగ్ చేసి క్రైస్తవ పాటలు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజీ ప్రకటించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన ఆలయ నిర్వాహకులకు సైతం సూచనలు చేసారు.   

భారతీయ సనాతన ధర్మానికి

మూలకేంద్రాలు ఆలయాలు అని, అక్కడ అన్ని వైదిక, అర్చనలు వివిధ ఆగమ విధానంగా జరుగుతాయన్నారు. వాటిని పరిరక్షించవలసిన వారు ఆలయాల కార్యనిర్వహణాధికారులేనన్నారు. ఆలయాల పరిధిలో ఉద్యోగులు అందరూ కేవలం ఆలయ మూల విరాట్ కే సేవకులన్నారు. అలాంటిది ఆలయాలను కించపరుస్తున్న దుష్ట శక్తులను కఠినంగా శిక్షించడంలో పూర్తిగా

విఫలమయ్యారన్నారు. దీనికి నిదర్శనమే ఈ నెల 24 న సింహాచలం ఆలయాన్ని అవహేళన చేస్తూ ఒక మార్ఫింగ్ వీడియో సోషల్ మీడియా లోనూ, ప్రసార మాధ్యమాల్లోనూ ప్రసారం జరిగిందన్నారు. ఈ దుశ్చర్య కు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కారణమైన వారు ఎంతటి వారైనా, పలుకుబడి  ఉన్నవారైనా, వాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. ఇకపై ఏ దేవాలయం

పై గానీ, హిందూ అర్చన, ఆగమ, వైదిక సంప్రదాయాలపై అవహేళన చేసే ప్రయత్నం  ఎవరు చేసినా కఠిన చర్యలు  తీసుకుంటామని హెచ్చరించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam