DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహగిరి పై భక్తులకి మాత్రమేనా కోవిడ్ రూల్స్, .సిబ్బంది కి లేవా?

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 28, 2021 (డిఎన్ఎస్):* నిబంధనలు, ఆంక్షలు కేవలం భక్తులకు అన్నట్టుగా సింహాచలం క్షేత్రం లోని సిబ్బంది పనితీరు కనపడుతోంది. సింహాచలం కొండపైకి రావాలంటే ప్రతి ఒక్కరూ ముఖానికి మాస్క్ లు పెట్టుకోవాలి అని ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ ఆదేశాలు జారీ చేసారు. అయితే టికెట్లు ఇచ్చే కౌంటర్

లోని సిబ్బందే ముఖానికి మాస్క్ లు లేకుండా. .భక్తులకు టికెట్ల ఇవ్వడం గమనార్హం. ముఖానికి మాస్క్ లు లేని భక్తులపై అధికారాన్ని జుళిపించే ఆలయ సిబ్బంది కి టికెట్ కౌంటర్ సిబ్బంది కనపడక పోవడం గమనార్హం. ఆలయ ఈఓ సూర్యకళ, వైదిక, అర్చక సిబ్బంది, సహా అందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తుంటే. .క్రింది స్థాయి సిబ్బంది రూల్స్ ని పూర్తిగా

బేఖాతరు చెయ్యడం శోచనీయం.    

ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్యదైవమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానంలో ఆలయ అధికారులు, అర్చక సిబ్బంది, మీడియా వర్గాలతో సహా అందరికీ ఎన్నో నిబంధనలను అమలు  చేస్తున్నట్టు ఆలయ ఈఓ ఎంవి సూర్యకళ ప్రకటించారు. మీడియా వారిని సైతం పూర్తిగా  నిరోధిస్తూ కెమెరాలు, వీడియో రాజద్వారం

దాటి అనుమతించకుండా ఆదేశాలు జారీ చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam