DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందువుల స్వయంకృతాపరాథమే మతమార్పిళ్లకు ఆహారం

*పద్దతి పై నామోషియే పాషండ మతాల విస్తరణకు కారణాలు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జూన్ 29, 2021 (డిఎన్ఎస్):* అఖండ భారతవానిలో పూర్తిగా సనాతన హైందవ ధర్మమే పాటించబడేది. అయితే హిందూ సమాజం చేసుకున్న స్వయంకృతాపరాథ పనులే ఎడారి మాటలకూ, మ్లేచ్చ జాతులకు ఆహారం అయ్యింది. ప్రధానంగా హైందవ సమాజం

చేస్తున్న తప్పుల్లో ప్రధానమైనవి, తల్లిదండ్రుల నిర్లక్ష్య వైఖరే. హిందుత్వ విధానాలపై చిన్న చూపు, వాటిని పాటించడంపై నామోషియే ప్రధాన కారణాలుగా కనపడుతున్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా సమాజంలో యువతి యువకులకు హైందవ ధర్మం విలువ, వైభవాన్ని తెలియచేయక పోవడమే నేటి తల్లిదండ్రులు చేసిన ఘోరమైన తప్పిదం. వాటి ప్రభావం పాషండ మతాలూ,

ఎడారి మతాలూ, మ్లేచ్చ జాతులు భారతావనిలో  అడుగుపెట్టి ధన, విచ్చలవిడితనం లాంటి ప్రలోభాలు చూపి వారిని తమ నీచ పద్ధతులకు బానిసలుగా మార్చేశాయి.  వాటిల్లో ప్రధానమైనవి ఇవే. వీటిని సరిదిద్దుకుంటే. . .యువత సక్రమ మార్గంలో పడే అవకాశాలున్నాయి. 

01. పిల్లలకి బొట్టు పెట్టుకోవడం నేర్పించటం నామోషీ . 
02. కనీసం

వారానికొక్కమారు దేవాలయానికి వెళ్ళడానికి నామోషీ
03. ప్రతిరోజూ సంధ్యావందనం చెయ్యడం పెద్ద సాహసం గా భావించడం, తద్వారా మానెయ్యడం. 
04. సూర్యోదయానికి ముందే నిద్రలేచి, కాలకృత్యాలు ముగించి,  పొద్దునే దీపం వెలిగించి వచ్చిన నాలుగు స్తోత్రాలు చదవటానికి నామోషీ.
05. సకల మానవాళికి మార్గదర్శకంగా శ్రీమద్భగవద్గీత ఇంట్లో

పెట్టుకోటానికి అసహ్యంగా భావించడం, 
06.  ప్రతి రోజు సాయంకాలం స్నానాదికాలు ముగించి, పురాణ పఠనం చేయటానికి నామోషీ...
07. నుదుటన నామం, విభూతి, బొట్టు పెట్టుకోవడం, పంచ కట్టుకోవటం నామోషీ - శిఖ ధరించడం నామోషీ ..
08. ప్రపంచానికే వైభవం తెచ్చిన శ్రీ రామాయణ, భారత, భాగవత గ్రంథాలలోని విషయాలు వీళ్ళకే తెలియదు, ఇంకా పిల్లలకి ఏమి

చెప్తారు. కనీసం వాటిని చదవడానికి కూడా అనవసరంగా భావించడం. 
09. యజ్ఞోపవీతం భుజం పై ఉంచుకోడానికే పెద్ద ఇబ్బందిగా భావించడం, అది ఒంటి పై ఉండడం పెద్ద నామోషీ గా భావించడం.
10. పండగల్లో ఊరంతా కలిసి ఒకేచోట వేడుకలు జరుపుకోడానికి పరువు తక్కువగా భావించడం, పార్టీకో స్టేజి - కులానికో స్టేజి పెట్టి, ఊరంతటినీ విడగొట్టి

దెబ్బలాడుకోవడం. 
11 . పుణ్యక్షేత్రాల సందర్శనాన్ని పవిత్ర తీర్ధ యాత్రగా చెయ్యాలె తప్ప పిక్నిక్ లు గా చెయ్యడం వల్ల ఆలయాలు, వాటి వైభవం యువతకు తెలియకుండా పోతుంది. 
12 . పవిత్ర పర్వదినోత్సవాల్లో నదుల్లో పవిత్ర స్నానాలు చేయించడం ద్వారా ఈ దేశంలో నదుల ప్రభావం ఏంటో తెలుస్తుంది. అలా చెయ్యక పొతే నదులు అంటే. . వాళ్ళ

దృష్టిలో పెద్ద సైజు స్విమ్మింగ్ పూల్ గా మారిపోతుంది.  
13 . గ్రామాల్లో, నగరాల్లో జరిగే దేవాలయాల ఉత్సవాల్లో తప్పనిసరిగా మొత్తం కుటుంబ సభ్యులు పాల్గొనాలి. 

14. రికార్డింగు డాన్సులకి తగలెయ్యటానికి లక్షలాది రూపాయలు కుమ్మరిస్తారు, కానీ ఊళ్ళో దేవాలయాన్ని బాగుచేయడానికి కానీ ఖర్చు చెయ్యరు.  

15.

జాంబవంతుడెవరు అని అడిగితె జాంబియా దేశాద్యక్షుడు అని చెప్పుకునే స్థాయి చదువులు ఉద్ధరిస్తుంటే. . .హైందవ సంప్రదాయం గురించి నేటి తరానికి ఎలా తెలుస్తుంది. 

ఇలాంటి కనీస భాద్యతలను నెరవేర్చవలసిన తల్లిదండ్రులు వాటిని పూర్తిగా గాలికి వదిలేసి, ఇతర మతాలవాళ్లు హిందువులను బలవంత మతమార్పిళ్లు చేస్తున్నారంటూ

గగ్గోలు పెట్టడం తమ తప్పులను ఎదుటివాళ్ళ పైకే నెట్టెయ్యడమే. 

మీ ఇంట్లో పిల్లలను సంప్రదాయం ప్రకారం పెంచితే. . వాళ్ళని మతమార్పిళ్లు చేసే ధైర్యం గానీ శక్తి గానీ ఎవరికీ ఉంటాయి. 

నీ ఇంట్లో నీకు నచ్చిన పద్దతి నువు సరిగ్గా పాటిస్తే బలవంతంగా నీ బొట్టు చెరిపి మతం మార్చే దమ్ము ఎవరికీ

ఉంటుంది.? 

నేటి భారతావనిలో మతమార్పిళ్లు జరుగుతున్నాయి అంటే. . .ప్రధాన కారణం తల్లిదండ్రుల భాద్యతారాహిత్యమే. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam