DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయాలు ఇవే ...

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జూన్  30, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి పలు సంక్షేమ పధకాలను, విద్య సంస్థల ఏర్పాటుకు ఆమోద ముద్రవేసింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం జరిగిన మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే.. . .

- రాష్ట్ర వ్యాప్తంగా మొబైల్

వెటర్నరీ అంబులెన్స్ ల కొనుగోలుకు మంత్రివర్గం ఆమోదం..
- నవరత్నాల్లో భాగంగా 28లక్షల ఇళ్ల నిర్మాణానికి భారీ ప్రచార కార్యక్రమం.
- 9 నుంచి 12 వతరగతి విద్యార్ధులకు ల్యాప్ టాప్ ల పంపిణీకి ఆమోదముద్ర.
- ఒంగోలు శివారులో ఆంధ్రకేసరి వర్సిటీ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం.
- విజయనగరం జేఎన్ టీయూ ఇంజనీరింగ్ కళాశాలను వర్సిటీగా

మార్పుకు ఆమోదం.
- జేఎన్ టీయూ చట్టం 2008 సవరణకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం.
- టిడ్కో ద్వారా 2,62,216 ఇళ్ల నిర్మాణం పూర్తికి మంత్రివర్గం ఆమోదం.
- మౌలిక సదుపాయల కల్పనకు రూ.5990 కోట్ల మేర బ్యాంకు రుణం హామీకి ఆమోదం.
- 2021-24 ఐటీ విధానానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం.
- కాకినాడ పోర్టులో రీ గాసిఫికేషన్ టెర్మినల్ ఏర్పాటుపై చర్చ.
/> - మారిటైమ్ బోర్డుతో సంయుక్త కార్యకలాపాల నిర్వహణకు అనుమతి.
- రీసర్వే పట్టాదారులకు ధ్రువపత్రాల జారీకి భూహక్కు చట్ట సవరణకు ఆమోదం.
- విశాఖ నక్కపల్లి వద్ద హెటిరో డ్రగ్స్ భూ కేటాయింపునకు ఆమోదం.
- 81 ఎకరాల భూ కేటాయింపుకు అంగీకారం తెలిపిన మంత్రివర్గం .
- పుట్టపర్తి నియోజకవర్గానికి రాయలసీమ కరువు నివారణ ప్రాజెక్టు

కింద నీటి సరఫరా.
- తొలిదశ కింద ఎత్తిపోతల ,గ్రావిటీ ద్వారా నీటి సరఫరాకు అంగీకారం.
- రాష్ట్ర వ్యాప్తంగా పీహెచ్ సీలకు 539 కొత్త 104 వాహనాల కొనుగోలుకు ఆమోదం.
- విజయవాడలో గుణదలలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు ఆమోదం.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam