DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాన్సాస్ లెక్కల్లో అవకతవకలు, ఏజేసీని సరెండర్ చేస్తూ ఆదేశాలు

*రామచంద్రమోహన్ సరెండర్ చేస్తూ దేవాదాయశాఖ ఆదేశాలు.*

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జూన్  30, 2021 (డిఎన్ఎస్):*ఏపీ దేవాదాయశాఖ అదనపు కమిషనర్ కే రామచంద్ర మోహన్ ను ప్రభుత్వానికి సరెండర్ చే స్తూ ఆంధ్ర ప్రదేశ్ దేవాదాయ శాఖా ప్రత్యేక కమిషనర్ పి అర్జున రావు ఆదేశాలు జారీ చేసారు. 

అత్యంత

ప్రతిష్టాత్మకమైన మాన్సాస్ (మహారాజ  అలక్ నారాయణ్ సొసైటీ అఫ్  ఆర్ట్స్ & సైన్స్ ) ట్రస్ట్, సింహాచలం దేవస్థానం భూముల వ్యవహారం లో జరిగిన అవకతవకపై పారదర్శక విచారణకు ప్రత్యేక కమిషనర్ పి అర్జున రావు ఆదేశాలు జారీ చేసారు. 

2013 నుంచి 2019 వరకూ సింహాచలం దేవస్థానం ఈఓ గాను, మాన్సస్ ట్రస్ట్ (విజయనగరం) ఈఓ గాను సుదీర్ఘ కాలం

విధులు నిర్వహించిన కె. రామచంద్ర మోహన్, ( ప్రస్తుతం దేవాదాయ శాఖా అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు) సంస్థ ల నిర్వహణలో జరిగిన భూముల అవకతవ్వకాలకు భాద్యుణ్ని చేస్తూ తక్షణం అతన్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశం జారీచేసింది. 

ఈయన పదవి కాలంలో మాన్సాస్ ట్రస్ట్ నుంచి భూములకు సంబంధించి 22

అభియోగాలు రావడంతో వాటి పై విచారణ జరగవలసింది.  వెలుగు చూశాయి. ఈ కుంభకోణాల్లో పూర్తి విచారణకు ఆదేశాలు జారీ చేసింది. అభియోగాలు ఇతనిపైనే వచ్చినందున, ఈ విచారణలో ఇతను పాల్గొన్నట్టయితే విచారణ పారదర్శకంగా జరిగే అవకాశం లేనందున ఇతన్ని తక్షణం ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్టు ప్రత్యేక కమిషనర్ అర్జున రావు ఆదేశించారు.

 

ఈ ట్రస్ట్ భూముల అవకతవకలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam