DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సింహాచల ఆలయ అర్చకుల్లో ఎంతమంది కళ్యాణం చేయించగలరు? 

*అర్చక పట్టా ఉంది సరే. . ప్రతిభ, అర్హత ఎంతమందికి ఉంది?* 

(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)  

విశాఖపట్నం, జులై  03, 2021, 2021 (డిఎన్ఎస్): ఉత్తరాంద్ర జిల్లాల ఇలవేల్పుగా సింహాచలం క్షేత్రంలో కొలువైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి క్షేత్ర ఆలయంలో అర్చకులుగా సుమారు 32 మంది వైదికులు విధుల్లో

ఉన్నారు. అయితే అర్చకులుగా ఉన్నవారికి తప్పనిసరిగా స్వామి వారి కళ్యాణం చేయించడం వచ్చి ఉండాలి. ఈ సిబ్బంది అందరికి అర్చకులుగా సర్టిఫికెట్ లు ఉన్నాయి. అయితే కేవలం ఐదారుగురు మాత్రమే స్వామి వారి కళ్యాణం చేయించగలరు అని ఆలయ వైదిక వర్గాలే తెలియచేస్తున్నాయి. అయితే ఎవరికీ ఏ వైదిక క్రియ వచ్చు అనేది ఆలయ ఈఓ కి గానీ, ఇతర

సిబ్బందికి గానే తెలిసే అవకాశాలు తక్కువ. అధికారిక రిజిస్టర్ లో వీళ్ళు అర్చక, వర, తదితర పరీక్షల్లో ఉత్తీర్ణులైనట్టుగా సర్టిఫికెట్ లు జతపరిచి ఉండడంతో ఎవరికీ తెలియడం లేదు. అయితే ఆలయంలో అర్చకునిగా విధులు నిర్వహించే వారికి తప్పని సరిగా స్వామి కళ్యాణం చేయించడం వచ్చి ఉండాలి అనే నిబంధన కూడా ఉన్నట్టు వైదిక వర్గాలు

తెలియచేస్తున్నాయి. ప్రస్తుతం సింహాచల క్షేత్రంలోని పూర్తిస్థాయి అర్చకులుగా ఉన్న సీనియర్ వైదిక సిబ్బంది లో కేవలం ఐదు లేదా ఆరుగురు మాత్రమే స్వామికళ్యాణం చేయించగలరని, మిగిలిన వారికి ఆ ప్రక్రియ లో పరిజ్ఞానం లేదని తెలుస్తోంది. 

పరిజ్ఞానం లేకుంటే. . పరిచారకులే. . .

అయితే ఈ కల్యాణ నిర్వహణ పరిజ్ఞానం

లేనివారిని పరిచారికులుగానే ఉంచాలి తప్ప, ప్రమోషన్ పేరిట పదోన్నతి కల్పించి, అర్చకులుగా చేయడం తో పాటు అధిక వేతనాలను కూడా అందించడం వలన ఇబ్బంది తలెత్తుతుందని వాపోతున్నారు. 

అయితే పరిచారికలుగా ఉన్నజూనియర్ వైదిక సిబ్బందిలో స్వామి వారి కళ్యాణం అద్భుతంగా చేయించగల దిట్టలు ఉన్నారని, అయితే నిబంధనలు పేరుతొ

వారికి అర్చక హోదా కల్పించలేదని తెలుస్తోంది. ఎంతమంది అర్చకులు స్వాతీ హోమం, స్వర్ణ అర్చన, ఇతర పక్ష మాస పవిత్ర, తదితర ప్రత్యేక ఉత్సవాలు చేయించగలరు. 

అర్చకులకు వైదిక క్రియ పూర్తిగా తెలిసి ఉండకపోతే. . .ఆలయంలో విధులు ఎలా నిర్వహిస్తారు అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అర్చకత్వం అనేది ఒక డ్యూటీ కాదని, ఇది

స్వామికి చేసుకునే సేవ మాత్రమేనని, ఈ సేవ కేవలం అతి కొద్దిమందికే లభిస్తుందన్నారు. అన్ని అర్హతలూ ఉన్నా. . చాలా మంది వైదికులకు ఆలయాల్లో ఉద్యోగాలు రావడం లేదన్నారు. ఉద్యోగాలు వచ్చిన వారికి వైదిక కార్యక్రమాలు రావడం లేదనే అభిప్రాయం సాక్షాత్తు వైదిక సిబ్బందిలోనే ఉత్పన్నమవుతోంది.

అధికంగా వేతనాలు .  అర్హత లేని

ఉద్యోగాలు. .

అర్చకులకు సీనియర్ అసిస్టెంట్ స్థాయి వేతనం, ముఖ్య అర్చకునికి సూపరెంటెండెంట్ స్థాయి  వేతనం, ఉప ప్రధానార్చకునికి సహాయ కమిషనర్ స్థాయి వేతనం, ప్రధానార్చకునికి డిప్యూటీ కమీషనర్ స్థాయి వేతనం, స్థానాచార్యులు కూడా డిప్యూటీ కమీషనర్ స్థాయి వేతనం అందించడం జరుగుతోంది. 
పారాయణదారులకు జూనియర్

అసిస్టెంట్ లేదా రికార్డ్ అసిస్టెంట్ స్థాయి వేతనం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక తాత్కాలిక వైదిక సిబ్బందికి కేవలం రోజుకు రూ. 300 మాత్రం ఇస్తున్నట్టు సమాచారం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam