DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాన్సాస్ ట్రస్ట్ అవకతవకలపై విశాఖ డీసీ విచారణ 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 05, 2021 (డిఎన్ఎస్):* ప్రతిష్టాత్మకమైన శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, సింహాచలం, మాన్సాస్ ట్రస్ట్ భూముల వ్యవహారంలో జరిగిన అవకతవకలపై విచారణాధికారి గా విశాఖపట్నం ఉప కమిషనర్ ఈవీ పుష్పవర్ధన్ ని రాష్ట్ర ప్రభుత్వం  నియమించింది. ఈ నెల 15 లోగా ప్రాథమిక

నివేదిక ఇవ్వాలని దేవదాయశాఖ కమిషనర్ ఆదేశించారు. విచారణాధికారికి సింహాచలం దేవస్థానం ఈవో, మాన్సాస్ ట్రస్ట్ ఈవో సహకరించాలని సూచించారు. 

అత్యంత ప్రతిష్టాత్మకమైన మాన్సాస్ (మహారాజ  అలక్ నారాయణ్ సొసైటీ అఫ్  ఆర్ట్స్ & సైన్స్ ) ట్రస్ట్, సింహాచలం దేవస్థానం భూముల వ్యవహారం లో జరిగిన అవకతవకపై పారదర్శక విచారణకు

ప్రత్యేక  కమిషనర్ పి అర్జున రావు ఆదేశాలు జారీ చేసారు. 

2013 నుంచి 2019 వరకూ సింహాచలం దేవస్థానం ఈఓ గాను, మాన్సస్ ట్రస్ట్ (విజయనగరం) ఈఓ గాను సుదీర్ఘ కాలం విధులు నిర్వహించిన కె. రామచంద్ర మోహన్, ( ప్రస్తుతం దేవాదాయ శాఖా అదనపు కమిషనర్ గా విధులు నిర్వహిస్తున్నారు) సంస్థల నిర్వహణలో జరిగిన భూముల అవకతవ్వకాలకు

భాద్యుణ్ని చేస్తూ తక్షణం అతన్ని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ ప్రభుత్వం ఆదేశం జారీచేసిన విషయం తెలిసిందే. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam