DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీజేపీ రాష్ట్ర ధార్మిక కమిటీ సభ్యునిగా విజయ్ ఫణి 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 05, 2021 (డిఎన్ఎస్):* హిందూ ధార్మిక విభాగంలో విస్తృతంగా పని చేస్తూ, దేవాలయాల పరిరక్షణ, గో రక్షణ తదితర ధార్మిక రక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న విజయ్ శంకర్ ఫణి ని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక కమిటీ లో సభ్యునిగా నియమించారు. విశాఖ నగర పరిధిలోని హిందూ దేవాలయాల్లో

జరుగుతున్నా అవకతవకలపై సత్వరంగా స్పందిస్తూ, వాటిని సరిదిద్దే విధంగా ఆయా విభాగాల అధికారుల తో చర్చలు జరిపి విజయం సాధించడం లో నేర్పరిగా పేరుపొందారు ఫణి. సింహాచలం క్షేత్రంలోని ఆలయంలో జరిగిన పలు అవకతవకలు, వీడియో మార్ఫింగ్ ల చర్యలకు డిమాండ్ చెయ్యడం, గో శాలలో గోవుల తరలింపులను సమర్ధవంతంగా అడ్డుకోవడం లో పూర్తి విజయం

సాధించారు. 
గతంలో భారతీయ జనతా యువమోర్చ విశాఖ నగర అధ్యక్షునిగా సేవలందించి, రాష్ట్ర స్థాయి కమిటీ లో స్థానం పొందిన ఫణిని నగర బీజేపీ శ్రేణులు, విశ్వ హిందూ పరిషద్ ప్రతినిధులు తదితరులు అభినందిస్తున్నారు.  

విశాఖపట్నంలోని అత్యంత రద్దీ కూడలి అయినా NAD జంక్షన్ లో గల ప్రమాద విశ్వేశ్వర దేవాలయ ప్రాంగణాన్ని

స్థానిక జీవీఎంసీ కాంట్రాక్టర్ ఎటువంటి సమాచారం లేకుండా కూల్చి వేయడంతో సోమవారం ఫణి ఆధ్వర్యవంలో ఉద్యమించి, తిరిగి ప్రాంగణాన్ని యధాస్థాన నిర్మించేందుకు చర్చలు జరుపుతున్న సమయంలోనే ఈ నియామక వార్తలు వెలువడడం గమనార్హం. 

 భారతీయ జనతా పార్టీ ధార్మిక సెల్ కు రాష్ట్ర కన్వీనర్ గా రాజమహేంద్రవరం కు చెందిన

ఇస్కాన్ అధ్యక్షులు సత్య గోపీదాస్ నియమితులయ్యారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా విశాఖ నుంచి ఫణి, కాకినాడ నుంచి చిరంజీవి, విజయవాడ నుంచి దాశరధి నియమితులయ్యారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam