DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోవధకు అనుమతి ఎలా ఇస్తున్నారు: బీజేపీ ధార్మిక సెల్ 

బక్రీద్ కు అక్రమ గో రవాణా, వధ ను నిషేధించాలి: 

*విశాఖపట్నం, జులై 14, 2021 (డిఎన్ఎస్):* భారత దేశ చట్టాల ప్రకారం గో వధ చేయరాదని, అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమాయక గోవులను విచ్చలవిడిగా వేధిస్తున్నారని, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ సభ్యులు విజయ్ శంకర్ ఫణి మండిపడ్డారు. దీనికోసం వేలాదిగా గోవులను అక్రమంగా

తరలిస్తున్నారని, ఈ నెల 21 న ముస్లిమ్స్ జరుపుకునే బక్రీద్ సందర్భంగా అక్రమ గో రవాణా మరియు గోవధ విచ్చలవిడిగా జరుగుతున్న తరుణంలో వాటిని అడ్డుకుంటున్న గో రక్షకులు, హిందూ భక్తులు, హైందవ సంఘాలపై ఎదురుదాడులు చేస్తున్నారని, ఇకపై ఇవి సాగవని హెచ్చరించారు. బుధవారం విశాఖ మహా నగరంలోని హైందవ సంఘాలతో కలిసి జీవీఎంసీ కమిషనర్ సృజన,

 పోలీస్ కమిషనర్ మనీష కుమార్ సిన్హా, విశాఖ మహా నగర మేయర్ హరి వెంకట కుమారికి వినతి పత్రం అందించారు.  

1977 గోవధ నిషేధ చట్టం మరియు వివరించి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని గోవధ కు  మద్దతు తెలిపితే సెక్షన్ 166 ప్రకారం చట్టపరంగా శిక్షార్హులే అని వారికి తెలియచేసి గోవధ నిషేధించాలని వారికి వినతిపత్రం ఇవ్వడం

జరిగిందని తెలిపారు. 

అక్రమ గోవధ శాల లో  ఏవిధంగా లైసెన్సులు ఇస్తున్నారని ప్రశ్నించారు.  ఈ కార్యక్రమానికి  విశ్వహిందూ పరిషత్ జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మాధవి, హిందూ దేవాలయ పరిరక్షణ సమితి తదితర సంఘాల సభ్యులు తదితరులు

పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam