DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైభవంగా శ్రీరమ్య తిరుమలలో రామాయణ పునర్వసు పారాయణ

*ఆలయ అభివృద్ధి, ప్రజా శ్రేయస్సుకై సాగుతున్న పారాయణ* 

*(DNS report : వెంకటాచార్యులు S, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)* 

*శ్రీకాకుళం, జులై 14, 2021 (డిఎన్ఎస్):* తీరని కోర్కెలు సైతం తీర్చే దైవం శ్రీ రమ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి లో సమాజ శ్రేయస్సుకై, ఆలయ అభివృద్ధి కై పునర్వసు రామాయణ పారాయణ అత్యంత వైభవంగా

సాగుతోంది. గత ఏడాదిన్నర కాలంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొరోనా మహమ్మారి నుంచి పూర్తి విముక్తి కలగాలని, ఆలయానికి అత్యంత ఆవశ్యకమైన స్వాగత ద్వారం ఏర్పాటు త్వరితగతిన జరగాలనే సంకల్పంతో ఈ నెల 10 వ తేదీన ప్రారంభించిన సంపూర్ణ శ్రీరామాయణ ఆలయ అర్చకులు కరి రంగనాధ్ తెలియచేసారు.   

భక్తులు తమ కోర్కెలను

నెరవేర్చుకునేందుకు స్వామి ఎదుట మొక్కుకుని పారాయణ చేయడం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. గత రెండేళ్ల కాలంగా నిరంతర సుందరకాండ పారాయణ నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది నుంచి పునర్వసు రామాయణ పారాయణాలు ఆరంభించినట్టు తెలిపారు. 

ఈ ఆలయం శ్రీకాకుళం నుంచి అరసవల్లి వెళ్లే మార్గంలో అత్యంత రద్దీ ప్రాంతమైన మెయిన్ రోడ్డు

లోనే నెలకొని ఉంది. శ్రీశ్రీ సంప్రదాయ సాహిత్య రంగం సంస్థ ఆధ్వర్యవంలో నిర్వహించ బడుతున్న ఆధ్యాత్మిక కేంద్రం ఇది. ఇక్కడ సాక్షాత్తు శ్రీవేంకటేశ్వరుని సాక్షాత్కారం లభిస్తుంది. తిరుమల తిరుపతి క్షేత్రం నుంచి వచ్చిన మూలవిరాట్టే ఈయన. గత కొన్నేళ్లుగా భక్తుల కోర్కెలు తీరుస్తూ. .శ్రీమహాలక్ష్మి సమేతంగా కొలువై

ఉన్నాడు.

లోక సంరక్షణార్థం, కొరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని రక్షించమని, ఈ సన్నిధికి ప్రధాన స్వాగత ద్వారా నిర్మాణం కోసం జులై 10, 2021 శనివారం నుంచి (పునర్వసు నక్షత్రం ) నుంచి ఆగస్టు 5 వ తేదీ గురువారం 27 రోజుల పాటు సాగుతుంది. 

భక్తుల కోర్కెలు సిద్ది కోసం, శ్రీ రమ్య తిరుమల ఆలయ అభివృద్ధి కొరకు జరుగుతున్నఈ

పునర్వసు పారాయణం లో పాల్గొనదలచిన భక్తులు పూర్తి వివరాలకు అర్చకులు (ఫో.: 9440061940 ) సంప్రదించవచ్చన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam