DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్ గా సీతంరాజు సుధాకర్

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 17, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్ గా విశాఖపట్నం కు చెందిన సీతంరాజు సుధాకర్ ను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు నియమించింది. గత 30 ఏళ్లుగా రాజకీయ రంగంలో రాణిస్తూ,  గడిచిన 8 ఏళ్లుగా పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పదవిని అప్పగించింది.  

స్టీల్, ఐరన్ వ్యాపార రంగంలో అత్యున్నత స్థాయి లో ఉన్న సుధాకర్, బియ్యం ఎగుమతి వ్యాపారంలో కూడా రాణిస్తున్నారు.  జూన్ 2, 1971 న పుట్టిన సుధాకర్ బి.కామ్ పట్టభద్రులు. 
ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషలు అనర్గళంగా మాట్లాడగలరు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఢిల్లీ నుంచి గల్లీ

వరకూ విస్తృత సేవలు అందించారు. ఆయనకు దాదాపు కుడిభుజంగా ఉంటూ, ఢిల్లీ అధిష్టానం తో నిరంతరం చర్చలు జరుపుతూ, రాష్ట్రంలో అభివృద్ధి కార్యాచరణకు తనవంతు పూర్తి సహకారాన్ని అందించారు. విభజన అనంతరం వైఎస్ జగన్ వెంట ప్రయాణం సాగించారు.

ప్రధానంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్రలో విశాఖ వేదికగా జరిగిన

బ్రాహ్మణా గర్జన ను దిగ్విజయం చేయడం వెనుక కీలక పాత్ర పోషించారు సుధాకర్.    
  
బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సుధాకర్ కు ఉత్తరాంధ్ర శ్రీవైష్ణవ సంఘం గౌరవ అధ్యక్షులు ఎస్టీపీ రంగనాధ అయ్యంగార్, అధ్యక్షులు శేషావతారం, అఖిల భారత శ్రీవైష్ణవ సంఘం (గుంటూరు) అధ్యక్షులు నర్సింహాచార్యులు, ప్రధాన

కార్యదర్శి బాల బాలాజీ, బ్రాహ్మణా సంఘాల ప్రతినిధులు అభినందనలు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam