DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టోక్యో ఒలింపిక్స్, ఫెన్సింగ్ పోటీల్లో అర్చకుని కుమార్తె 

*తోలి సారిగా ఫెన్సింగ్ లో భారత ప్రతినిధ్యంలో భవాని*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 17, 2021 (డిఎన్ఎస్):* క్రీడా ప్రపంచంలో అత్యంత అగ్రశ్రేణి పోటీలైన ఒలింపిక్స్ లో భారత్ ప్రాతినిధ్యం వహించే క్రీడంశాలు అతి తక్కువ ఉంటాయి. కారణం తగిన శిక్షణ లేని కారణంగా అర్హత సాధించలేకపోవడమే.

వ్యక్తిగతంగా శిక్షణ పొందే వారు మాత్రం అప్పుడప్పుడు అర్హత సంధిస్తుంటారు. భారత్ పోటీ పడే క్రీడంశాల్లో హాకీ, టెన్నిస్, బ్యాడ్మింటన్, లు మాత్రమే ఉంటాయి. ప్రస్తుతం జపాన్ లోని టోక్యో లో జరుగుతున్నా ఒలింపిక్స్ పోటీలకు ఫెన్సింగ్ క్రీడంశంలో భారత్ తోలి సారి పోటీపడుతోంది. ఈ విభాగం లో మొట్టమొదటిసారిగా ప్రాతినిధ్యం

వహిస్తున్న భారత్ ప్రతినిధిగా తొలి ఫెన్సర్‌గా ఆమె రికార్డు సాధించిన క్రీడాకారిణి  ఒక మహిళా కావడం గర్వకారణం. ఈమె తమిళనాడు రాష్ట్రానికి చెందిన చదలవాడ భవాని దేవి, ఈమె తండ్రి సుందరరామన్ ఒక అర్చకుడు కావడం మరింత విశేషం.  

ఒక ప్రక్క క్రీడల్లో రాణిస్తూ, మరోప్రక్క ఉన్నత విద్యను కూడా పూర్తి చేయడం అభినందనీయం.

చెన్నై లోని సెయింట్ జోసెఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేసి, కేరళలోని  తలస్సేరి బ్రేన్నెన్ ప్రభుత్వ కాలేజీ నుంచి ఎంబీఏ కూడా పూర్తి చేసారు.  

సంప్రదాయ అర్చక  బ్రాహ్మణ కుటుంబంలో బాలికలు కట్టుదిట్టమైన విధానంలో పెరుగడం జరుగుతుంది. భవాని ని క్రీడారంగంలో ప్రపంచ స్థాయి లో రాణిస్తున్నప్పడికి,

అదే సంప్రదాయం కొనసాగించడం హర్షణీయం.

భవానీదేవి 1993, ఆగస్టు 27న తమిళనాడు రాష్ట్రం, చెన్నైలో ఆనంద సుందరం, రమణి దంపతులకు జన్మించింది.

భవానీ దేవి 14 ఏళ్ల వయసులోనే తొలి అంతర్జాతీయ టోర్నీ ఆడి 2009లో మలేషియాలో జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో రజత పతకం సాధించింది. 2018 కామన్వెల్త్‌ క్రీడల్లో బంగారు పతకం సాధించి,

ఫెన్సింగ్‌ క్రీడాలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. 
ఆమె 2021 జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఒలింపిక్స్ పోటీల్లో అడ్జెస్టెడ్ అఫీషియల్ ర్యాంకింగ్ (ఏఓఆర్) పద్ధతిలో భవానీదేవి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన భారత తొలి

ఫెన్సర్‌గా చరిత్ర సృష్టించింది.

కుమార్తె క్రీడా భవిష్యత్ కోసం ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి ఈమె తల్లి తన బంగారు నగలను సైతం అమ్మడం గమనార్హం. భవాని వెంట ఆమె కూడా వ్యక్తిగత మేనేజర్ గా ఈ నెల 23 నుంచి మొదలవుతున్న టోక్యో ఒలింపిక్స్ కు హాజరవుతున్నారు.   

ఇటలీ కి చెందిన నికోలా జనోట్టి ద్వారా 2016

నుంచి శిక్షణ పొందుతోంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam