DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దోషులకు ఉద్యోగం ఊస్టింగ్ చేస్తే ఇంకెక్కడా మరో తప్పు జరగదు

*సిబ్బందిని సస్పెండ్ చేస్తే. .చేసిన దోషానికి తగిన శిక్ష వేసినట్టా?*

*లంచం తీసుకున్నా ఊస్టింగ్ చెయ్యాల్సిందే: విహెచ్పి నేత పూడిపెద్ది*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 18, 2021 (డిఎన్ఎస్):* ప్రముఖ దివ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం లో ఇటీవల జరిగిన

గరుడ గద్య వీడియో మార్ఫింగ్ లో దోషులకు సస్పెన్షన్ వేటు వెయ్యడం జరిగింది. ఇలాంటి దోషులకు సస్పెన్షన్ అనే శిక్ష సరికాదని, ఏకంగా ఉద్యోగం నుంచి ఊస్టింగ్ చెయ్యాలని విశ్వ హిందూ పరిషత్ విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ డిమాండ్ చేసారు. సింహాచలం ఘటనలో ఈ దోషులు ఇద్దరూ వైదిక పండితులు, వీళ్ళకి తామే చేసిన పనేంటో

కూడా తెలుసు. దానికి ప్రాయశ్చిత్తం కూడా ఏమి చేసుకోవాలో కూడా తెలుసు. అయితే వీళ్ళని ప్రాయశ్చితం చేసుకోనివ్వకుండా, కేవలం సస్పెండ్ చేసి విడిచిపెట్టడం వెనుక అధికారుల పాత్ర ఏమేరకు ఉంది అనే సందేహాలు కలుగుతున్నాయన్నారు. 

దేవస్తానం లో ఉద్యోగులు తమ సహచర వైదికుని మంత్రం ఆచరణను అన్యమత, వెకిలి పాటలతో మార్ఫింగ్

చెయ్యడం కడు శోచనీయం.  దీనికి బహిరంగం ఆ బాధిత వైదిక సిబ్బందికి క్షమాపణ చెప్పాల్సి ఉంది. పైగా ఆలయ వైదిక ఉద్యోగులుగా ఉన్నవాళ్లు ఇలాంటి దోషం చేస్తే. .వాళ్ళకి కఠిన శిక్ష విధించాల్సి ఉంది అన్నారు. 

దోషులకు ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తే, ఇలాంటి దుర్ఘటనలు ఇంకెక్కడా జరగకుండా ఉంటాయి. కేవలం సస్పెన్షన్ తో సరి

పెడితే. .మూడు నెలల కాలం డ్యూటీ లేకుండా ఉత్తినే సగం జీతం పొందుతూ మరింత ఆనందంగా ఉండే అవకాశం ఉంది. సామాన్య ఉద్యోగులు తప్పు చేస్తే క్షమాపణ ఉంటుంది, కానీ, నిత్యం మూల విరాట్ దగ్గర ఉండే వైదిక సిబ్బంది తప్పు చేస్తే క్షమాపణ గానీ, ప్రాయశ్చిత్తం గానీ లేవు. అందరికీ మంచి చెప్పాల్సిన వాళ్ళే తప్పు దారిలో వెళితే. . ఎటువంటి సంకేతాలు

జనంలోకి వెళ్తున్నట్టో చెప్పాలన్నారు. 

అదే విధంగా ప్రజల నుంచి లంచం తీసుకుంటూ దొరికిన ప్రభుత్వ ఉద్యోగులను కూడా ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేసారు. ఉద్యోగం వచ్చేదాకా నిరుద్యోగులుగా ఉంది, ఆకలి కేకలు అంటూ రోడ్డెక్కుతున్నారని, తీరా ఉద్యోగం వచ్చాక లంచాలతో పందికొక్కులుగా నిధులు

మింగుతున్నారని మండిపడ్డారు. ఒక్కరికి సరైన శిక్ష వేస్తె తప్ప గాడి తప్పిన ఉద్యోగుల్లో మార్పు రాదన్నారు. వేలల్లో జీతాలు తీసుకునే దేవాదాయ శాఖా ఉద్యోగులు కోట్లాది రూపాయల విలువ చేసే అక్రమాస్తులు కూడబెడుతున్నారన్నారు. లంచం తీసుకుంటూ ఏసీబీ దొరికిన వాళ్ళు కూడా మూడు నెలల సస్పెన్షన్ తో సిగ్గులేకుండా మళ్ళీ డ్యూటీ లో చేరి

పాత పద్దతిలోనే అలవాటు పడిన అక్రమ కూడుకు తింటున్నారన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam