DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోవులు బక్రీద్ కు బలి కాకుండా 21 న గ్రేటర్ గో బంద్: యుగ తులసి

*గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి: ప్రధానికి యుగ తులసి డిమాండ్* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*భాగ్యనగరం / విశాఖపట్నం, జులై 19, 2021 (డిఎన్ఎస్):* మరో రెండు రోజుల్లో బక్రీద్ సందర్బంగా లక్షలాది గోవులను చంపేందుకు తెలంగాణ సిద్ధమైందని, ఆ దుర్మార్గానికి బలి కాకుండా గోవులను కాపాడేందుకు  21 న గ్రేటర్

గోబంద్ నిర్వహిస్తున్నట్టు గోరక్షణ సమితి నిర్వాహకులు యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్  తెలిపారు. భారతీయ సనాతన సంప్రదాయంలో గువుకు అత్యంత ప్రాధాన్యత ఉందని, వాటిని కాపాడేందుకు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు. 

ఈ దుర్మార్గాన్ని తక్షణం నిరోధించాలని

డిమాండ్ చేసారు.  గత రెండేళ్లుగా గో మాతల రక్షణే ధ్యేయంగా తెలంగాణ ప్రాంతమంతా తిరుగుతున్నామని, లక్షలాది గోవులను నిత్యం అక్రమంగా రవాణా చెయ్యడమే కాకుండా నిర్దాక్షిణ్యంగా బలిచేస్తున్నారని ఆవేదన చెందారు. భాగ్యనగరంలో ప్రతి వీధిలోని ఇంటి ముందు రెండు ఆవులు బలి ఇచ్చేందుకు సిద్ధం చేసారని తెలిపారు. భారత దేశ చట్టాల

ప్రకారం గోమాతను వధించడం నేరం అని, అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం, పాలకులు, అధికారులు, ఈ చట్టాలను ఏమాత్రం ఖాతరు చెయ్యడం లేదన్నారు. 

ఆవును జాతీయ జంతువుగా ప్రకటిస్తే. .కచ్చితంగా ఆవులను రక్షించి తీరాలన్నారు. ఇదే డిమాండ్ తో తిరుమల తిరుపతి దేవస్థానం గత పాలక మండలి ఒక తీర్మానం చేసి, కేంద్రానికి పంపిందన్నారు.

ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో గోవును జాతీయ జంతువుగా ప్రకటిస్తూ చట్టం చెయ్యాలని డిమాండ్ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam