DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అత్యంత ప్రాశస్త్యమైనది శయన ఏకాదశి, ఇదే తోలి ఏకాదశి

*హైందవ ధర్మానికి ప్రతీక చాతుర్మాస్య దీక్ష వ్రతారంభం*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 19, 2021 (డిఎన్ఎస్):* ఏ సందర్భంలోనైనా శుభకార్యక్రమాలు ప్రారంభించాలంటే హైందవ సంప్రదాయం లో అధిక ప్రాధాన్యత ఇచ్చేది దశమి ఏకాదశులే. ఏడాది లో వచ్చే 24 ఏకాదశుల్లో అత్యంత ప్రాధాన్యమైనది ఆషాఢ శుక్ల ఏకాదశి.

దీన్నే తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. ఈనెల 20 న వైభవంగా నిర్వహించుకునేందుకు alayalu, గృహస్తులు సిద్ధమవుతున్నారు.  పూర్వకాలమందు ఈ తోలిఏకాదశితోనే, సంవత్సర ప్రారంభంగా పరిగణించేవారు. శ్రీమహావిష్ణువు ఆరోజునుండి కార్తీకశుద్ధ ఏకాదశి వరకు యోగనిద్రలో ఉంటారని, ఈ రోజును 'శయన ఏకాదశి' అనికూడా పిలుస్తారు. అన్ని ఆలయాలూ ఈ ఏకాదశి

రోజును అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తుంటారు. ప్రత్యేక అభిషేకాలు, ఆరాధనలు, ప్రబంధ పఠనం చేస్తుంటారు. 

ఈనాటినుండి శ్రీహరిభక్తులు కామక్రోధాధులు వర్జించి, ప్రయాణాలు చేయకుండా ఒకేచోట ఉండి శ్రీహరిని అర్చిస్తూ తిరిగి కార్తీకశుద్ధ ఏకాదశి 'ఉత్థాన ఏకాదశి' వరకు ఆనాలుగు మాసములు చాతుర్మాస్య వ్రతం ఆచరించడం సనాతన

హైందవ సంప్రదాయం లో ప్రధానమైనది. ఈ చాతుర్మాస్య దీక్షను జీయర్లు, యతులు, సన్యాసులు తప్పని సరిగా ఆచరించాలి. గృహస్తులు అవకాశం బట్టి ఆచరించడం వస్తోంది. సన్యాసులు ఏడాది పాటు ఒకే చోట బస చేయకుండా సంచరించాల్సియుంటుంది. అయితే ఈ నాలుగు నెలలు వర్షాకాలం కావడం తో ప్రయాణాలు చేయడం ఇబ్బంది కరం కావడంతో ఒకే చోట ఉంది గ్రంథ అధ్యయనం

చేయడం జరుగుతుంది. దానితో పాటు ఆహార నియమాలు తప్పని  సరి.   కొందరు ఈ దీక్షను ఏకాదశి రోజున మొదలు పెడితే, ఇంకొందరు పౌర్ణమి రోజున ఆరంభిస్తుంటారు. 

శయన ఏకాదశి అనే పేరు విన్నంత మాత్రం చేతనే మన మహా పాపములు నశించి పోతాయి, అంతటి మహా మహిమ కలిగిన ఏకాదశి ఇది.

పూర్వము కృతయుగము చివరి పాదములో ప్రహ్లాదుని

మనుమడు విరోచన పుత్రుడు అయిన బలి చక్రవర్తి గురువుగారు శుక్రాచార్యుని కటాక్షంతో విశ్వజిత్ అనే యజ్ఞం చేసి, మహా శక్తులు పొంది, స్వర్గం మీదకు దండెత్తి వెళ్ళి, దేవతల స్వర్గమును ఆక్రమించుకుని, అక్కడ తన ప్రతినిధులను పెట్టి భూలోకంలో నర్మదా నది తీరంలో యాగములు చేస్తూ ఉండగా శ్రీ మహావిష్ణువు వామన రూపంలో వచ్చి మూడడుగులు

దానముగా పుచ్చుకుని బలి చక్రవర్తి ని అనుగ్రహించి పాతాళానికి పంపి, అక్కడ అధినేతగా చేసాడు. 

తప్పని సరి ఉపవాసం:. .

ఏడాది లో వచ్చే మొదటి ఏకాదశి కావడంతో ఈ రోజున తప్పనిసరిగా ఉపవసించి, శ్రీమన్నారాయణుని స్మరించాలి అని నియమం ఉంది. అన్ని ఆలయాల్లోనూ, గృహాల్లోనూ ఈ రోజున భగవన్నామ స్మరణ ఉదయం నుంచి సాయంత్రం

వరకూ జరుగుతుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam