DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయ భూములు అన్యాక్రాంతం పై బీజేపీ ధార్మిక సెల్ ఫిర్యాదు

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 19, 2021 (డిఎన్ఎస్):*  విశాఖపట్నం లోని శ్రీ కేశవ స్వామి ఆలయం దేవస్థానం కు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అవ్వడంతో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ధార్మిక సెల్ సభ్యులు విజయశంకర ఫణీంద్ర దేవాదాయ శాఖా విశాఖ జిల్లా సహాయ కమిషనర్ కె. శాంతి కి ఫిర్యాదు చేసారు. విశాఖపట్నం -

భీమిలి బీచ్ రోడ్ లోని కాపులుప్పాడ దగ్గర ఉన్న ఈ దేవస్థానం కు సంబంధించిన భూములు అన్యాక్రాంతం అయినట్టు తెలియడంతో, దానిమీద తక్షణమే సర్వే చేయించి రక్షణ గోడ నిర్మించాలని ఆమెను కోరడం జరిగింది. రాష్ట్ర దేవాదాయ శాఖా పరిధిలోని ఈ ఆలయం కు ఆదాయం తక్కువ గా ఉండడం, ఈ భూములపై వచ్చే ఆదాయం కూడా నిలిచిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు

కలుగుతున్నట్టు తెలిపారు. 
ఈ సమావేశానికి ఫణీంద్ర తో పాటు భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర కార్యవర్గసభ్యులు ధోనీ నాగరాజ్, చంద్రశేఖర్, భారతీయ జనతా యువమోర్చా నగర ప్రధాన కార్యదర్శి ప్రసాద్, నగర ఉపాధ్యక్షులు మల్లవరపు శంకర్, హోప్ ఫౌండేషన్ శ్రీదేవి ఇతర సభ్యులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam