DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ ఏడాది గిరి ప్రదక్షిణ రద్దు : సింహాచలం ఈఓ 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 21, 2021 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ప్యూ పొడిగింపు, కరోనా నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 23 న జరుగవలసిన శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి సింహ గిరి ప్రదక్షిణ రద్దు చేస్తున్నట్టు దేవస్థానం ఈఓ సూర్యకళ తెలిపారు.  సింహగిరిపైన

కూడా ప్రదక్షిణలకు అనుమతిలేదని తెలిపారు. సుమారు 32 కిలో మీటర్ల గిరి ప్రదక్షిణ లో వేలాదిగా భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పాల్గొనేందుకు విశాఖకు వస్తుంటారు. గత ఏడాది కూడా ఈ yatra రద్దు చేయడం జరిగింది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయన్నారు. ఈ నెల 23, 24వ తేదీల్లో స్వామివారి దర్శనాలు మాత్రం కరోనా నిబంధనలు పాటిస్తూ

ఉంటాయన్నారు. 23వ తేదీన శ్రీస్వామివారి మాస జయంతి, 24వ తేదీనే తుదివిడత చందన సమర్పణ ఉంటాయన్నారు. భక్తులు తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాల్సి ఉంటుందని తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam