DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇసుక కొండ పై ఆషాఢ పౌర్ణమి కి ప్రత్యేక సత్య వ్రతాలు

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 22, 2021 (డిఎన్ఎస్):* ఆషాఢ పౌర్ణమి జులై 24 వ తేదీ శనివారం పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖ లోని ఇసుక కొండ (కె జి హెచ్) పై గల శ్రీ రామా సామెత సత్యనారాయణ స్వామి దేవాలయంలో ప్రత్యేక సత్య వ్రతాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ బండారు ప్రసాద్ తెలిపారు. గురువారం ఆలయంలో

నిర్వహించిన విలేకర్ల సమావేశం లో అయన మాట్లాడుతూ ఉదయం 7 గంటలకు మొదటి బృందం, 10 గంటలకు రెండవ బృందం తోనూ ఈ వ్రతాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. దీనిలో పాల్గొనదలచిన భక్తులు రూ. 1116 రుసుము చెల్లించాలన్నారు. ఆలయంలో జరిగే ప్రతి కార్యక్రమం కొరోనా నిబంధలను పాటిస్తూ ముఖానికి మాస్క్, చేతులకు గౌజస్ ఉన్నవారిని మాత్రమే

అనుమతిస్తున్నామన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు నిత్యా సత్యనారాయణ వ్రతాలు జరుగుతూనున్నాయన్నారు. ఈ సమావేశంలో ఆలయ అర్చకులు నరసింహాచార్యులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam