DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొరోనా విముక్తి కై  సాగుతున్న పునర్వసు రామాయణ పారాయణ

*ఆలయ అభివృద్ధి తోపాటు, సమాజ సేవలోనూ శ్రీరమ్య తిరుమల*

*(DNS report : వెంకటాచార్యులు S, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)* 

*శ్రీకాకుళం, జులై  23, 2021 (డిఎన్ఎస్):* గత ఏడాదిన్నర కాలంగా సమాజాన్ని పీడిస్తున్న కొరోనా మహమ్మారి నుంచి పూర్తి విముక్తి కలగాలని, శ్రీ రమ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి లో పునర్వసు రామాయణ

పారాయణ చేస్తున్నట్టు శ్రీరామాయణ ఆలయ అర్చకులు కరి రంగనాధ్ తెలియచేసారు.

తీరని కోర్కెలు సైతం తీర్చే దైవం శ్రీ రమ్య తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి లో సమాజ శ్రేయస్సుకై, ఆలయ అభివృద్ధి కై ఈ నెల 10 న ప్రారంభమైన పునర్వసు రామాయణ పారాయణ అత్యంత వైభవంగా సాగుతోందన్నారు.  

గత ఏడాదిన్నర కాలంగా సమాజాన్ని

పట్టి పీడిస్తున్న కొరోనా మహమ్మారి నుంచి పూర్తి విముక్తి కలగాలని, ఆలయానికి అత్యంత ఆవశ్యకమైన స్వాగత ద్వారం ఏర్పాటు త్వరితగతిన జరగాలనే సంకల్పంతో నిర్వహిస్తున్నామన్నారు.   

భక్తులు తమ కోర్కెలను నెరవేర్చుకునేందుకు స్వామి ఎదుట మొక్కుకుని పారాయణ చేయడం మంచి ఫలితాలను ఇస్తోందన్నారు. గత రెండేళ్ల కాలంగా

నిరంతర సుందరకాండ పారాయణ పునర్వసు రామాయణ పారాయణాలు ఆరంభించినట్టు తెలిపారు. 

శ్రీవారి సన్నిధిలో అర్చనలతో పాటు సమాజ సేవా భాద్యతలను కూడా నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నట్టు తెలిపారు. దానిలో భాగంగా ప్రతి వారం అన్నార్తులకు అన్న ప్రసాద వితరణ, పేదలకు వస్త్ర సమర్పణ చేయడం జరుగుతోందన్నారు. ఈ వారం లో శ్రీకాకుళం

లోని సామాజిక వసతి గృహం లో చిన్నారులకు వస్త్రాలను అందించడం జరిగిందన్నారు.  

ఈ ఆలయం శ్రీకాకుళం నుంచి అరసవల్లి వెళ్లే మార్గంలో అత్యంత రద్దీ ప్రాంతమైన మెయిన్ రోడ్డు లోనే నెలకొని ఉంది. శ్రీశ్రీ సంప్రదాయ సాహిత్య రంగం సంస్థ ఆధ్వర్యవంలో నిర్వహించ బడుతున్న ఆధ్యాత్మిక కేంద్రం ఇది. ఇక్కడ సాక్షాత్తు

శ్రీవేంకటేశ్వరుని సాక్షాత్కారం లభిస్తుంది. తిరుమల తిరుపతి క్షేత్రం నుంచి వచ్చిన మూలవిరాట్టే ఈయన. గత కొన్నేళ్లుగా భక్తుల కోర్కెలు తీరుస్తూ. .శ్రీమహాలక్ష్మి సమేతంగా కొలువై ఉన్నాడు.

లోక సంరక్షణార్థం, కొరోనా మహమ్మారి నుంచి సమాజాన్ని రక్షించమని, ఈ సన్నిధికి ప్రధాన స్వాగత ద్వారా నిర్మాణం కోసం ఈ పునర్వసు

పారాయణ ఆగస్టు 5 వ తేదీ గురువారం 27 రోజుల పాటు సాగుతుంది. 

భక్తుల కోర్కెలు సిద్ది కోసం, శ్రీ రమ్య తిరుమల ఆలయ అభివృద్ధి కొరకు జరుగుతున్నఈ పునర్వసు పారాయణం లో పాల్గొనదలచిన భక్తులు పూర్తి వివరాలకు అర్చకులు (ఫో.: 9440061940 ) సంప్రదించవచ్చన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam