DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బహిరంగంగా మద్యం సేవిస్తే జైలుకే: రాజమండ్రి ఎస్పీ రస్తోగి

*(DNS report : Raja P, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జులై 23, 2021 (డిఎన్ఎస్):* బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తే జైలుకే పంపిస్తామని రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటీవలే అర్బన్ జిల్లా ఎస్పీ గా భాద్యతలు చేపట్టిన రస్తోగి ఆదేశాల మేరకు నగరరంలో ప్రజల భద్రత మరియు రక్షణ

పెంపొందించే నిమిత్తం మరియు నేరాల నియంత్రణలో భాగంగా నగరంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వ్యక్తులపై ప్రత్యేక దాడులు (స్పెషల్ డ్రైవ్) నిర్వహించడం జరిగింది. దీనిలో బాగంగా గత నాలుగు రోజులుగా నగరంలో స్పెషల్ పార్టీ పోలీసు బృందాలను మరియు పోలీసు స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా దాడులు

జరిపి బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే 414 వ్యక్తులను గుర్తించి వారి పై వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేయడం జరిగింది.

ఈ సందర్భంగా అర్బన్ జిల్లా ఎస్పీ  నగరంలో అనేక ప్రాంతాలలో ముఖ్యంగా మహిళలు, పిల్లలు సంచరించే బహిరంగ ప్రదేశాలలో అనగా, గోదావరి నది ఘాట్ల నందు, మద్యం షాపుల పరిసర ప్రాంతాలలో, పాన్ షాపులలో,

నగర శివారు ప్రాంతాలలో, ఇతర బహిరంగ ప్రాంతాలలో మద్యం సేవించి ప్రజా శాంతికి భంగం కలిగించే వ్యక్తులపై చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకోబడునని హెచ్చరించారు.

మరియు ప్రజల దృష్టికి వచ్చే అసాంఘిక వెంటనే డయల్ 100 లేదా వాట్సప్ నంబరు కార్యక్రమాల సమాచారాన్ని ప్రజలు 9490760794 ద్వారా పోలీసు వారికి అందజేయవలసిందిగా కోరడమైనది.

సమాచారం చెప్పిన వారి పేర్లు రహస్యంగా ఉంచబడునని తెలియ పరిచారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam