DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోవును చంపమన్న వైకాపా ఎమ్మెల్యేని అరెస్ట్ చెయ్యాలి

*హిందువులు ఓట్లు వెయ్యకుండానే గెలిచావా?: భాను ప్రకాష్ రెడ్డి*

*చెన్నకేశవ రెడ్డి కి వ్యతిరేకంగా బీజేపీ నిరసనలు, అరెస్టులు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 28, 2021 (డిఎన్ఎస్):* గోవులను చంపమని రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేసిన వైస్సార్  కాంగ్రెస్ పార్టీ కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు

ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డిని తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ తో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేసింది. బుధవారం అన్ని జిల్లా,ఆ మండల కేంద్రాల్లో ప్రజా ప్రతినిధులు, నేతలు, క్యాడర్ భారీ ఎత్తున నిరసనల్లో పాల్గొన్నారు. కొన్ని చోట్ల బీజేపీ నేతలను అరెస్టు చెయ్యడం గమనార్హం. 

చిత్తూరు జిల్లా

మదనపల్లె లో నిరసనల్లో పాల్గొన్న బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జె. భానుప్రకాష్ రెడ్డి, ఇతరులను అరెస్టు చేయడంతో మండిపడ్డారు.  

చెన్నకేశవరెడ్డి నువ్వు  గానీ, మీ నాయకులూ గానీ, హిందువులు ఓటు వేయకుండానే గెలిచారా? అని మండిపడ్డారు. మీకు వారు ఓట్ వేసింది వారి మనోభావాలను కించపరచమనా? ఇది చట్టరీత్యా నేరం

కాదా? 

విశాఖ లో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద జరిగిన నిరసనలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి విష్ణుకుమార్ రాజు, గాజువాక లో ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, విజయవాడ ధర్నా లో రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, తదితరులు నిరసనల్లో పాల్గొన్నారు.  

ప్రధానంగా వీళ్ళు చేసుతున్న డిమాండ్. .. గోవులను చంపుకు

తింటే నష్టం ఏంటి అనే వ్యాఖ్యలు చేసిన కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చిన్న కేశవరెడ్డి ని తక్షణం బర్తరఫ్ చెయ్యాలని, రాష్ట్రంలో వెంటనే గోవధనిషేధ చట్టాన్ని అమలు చేయాలి. 

మదనపల్లె ఎమ్మార్వో కార్యాలయం నందు ఆర్ఐ గారికి గోవధ నిషేధ చట్టం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే పై చర్యలు తీసుకునేలా

ప్రభుత్వానికి రిపోర్టు పంపించవలసిందిగా వినతి పత్రం సమర్పించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam