DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హుండీ తాళాలు ఇవ్వని దేవాదాయ శాఖ ఉద్యోగి సస్పెన్షన్

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 28, 2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం జిల్లా దేవదాయ ధర్మాదాయ శాఖలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది. హుండీ లెక్కింపు లో అవకతవకలు జరిగాయన్న కారణంతో ఎర్నిమాంబ అమ్మవారి దేవస్థానం ఈవో మరియు అనకాపల్లి ఇన్స్పెక్టర్ శ్రీనివాస రాజును డిప్యూటీ కమిషనర్ పుష్ప వర్ధన్ సస్పెండ్

చేయగా ఇక మరో ఇన్స్పెక్టర్ను సహాయ కమిషనర్ శాంతి. కళింగిరి సస్పెండ్ చేశారు. సీతంపేటలోని శ్రీ దుర్గా గణపతి ఆలయం, వెంకోజిపాలెం లోని జ్ఞానానంద ఆశ్రమం, సీతమ్మదారలోని మహాగణపతి ఆలయాలకు సంబంధించి హుండీల తాళాలు నిర్ణీత సమయంలో సహాయ కమిషనర్ కార్యాలయానికి అప్పగించ లేదన్న కారణంతో విశాఖపట్నం ఏరియా ఇన్స్పెక్టర్ మంగంపూడి

శ్రీధర్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. హుండీల తాళాలు అప్పగించడంలో 24నుండి 36గంటల జాప్యం జరిగిందన్న అభియోగంపై ఈ చర్యలు చేపట్టారు. ఆయనపై మొత్తం 31చార్జెస్ పెట్టారు. దీంతో ఆ శాఖలో పని చేస్తున్న ఉద్యోగుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఈ పరిణామాలు ఎటువైపు దారితీస్తాయో చూడాలి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam