DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సొసైటీలో స్టేటస్ విడిచి సన్యాసిగా రిలయన్స్ మాజీ నేత

*ఈ కుబేరునికి ఏటా 75 కోట్ల నిధులు కూడా తృణప్రాయమే. . .* 
    
*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, జులై 31, 2021 (డిఎన్ఎస్):* పైసా కోసం పడరాని పట్లు పడుతున్న ప్రజలున్న ప్రస్తుత సమాజంలో ఏటా సుమారు రూ. 75 కోట్లు ఆదాయం వస్తున్నా సరే. . అన్నింటిని తృణప్రాయంగా విడిచి పెట్టి సన్యాసిగా మారిన వాళ్ళు కూడా

ఉన్నారు. భారత దేశానికి ఆర్థిక శక్తిగా ఎదిగిన రిలయన్స్ సంస్థ లో ఉపాద్యక్షునిగా భాద్యతలు చేపట్టిన ప్రకాష్ షా వార్షిక ఆదాయం రూ. 75 కోట్లు పైమాటే. పైగా స్థిర, చరాస్తుల మాట లెక్కే లేదు. అయితే ఇదంతా గత చరిత్ర. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీకి అత్యంత సన్నిహితుడుగా, కుడిభుజంగా ఉన్న ప్రకాష్ షా. . .లౌకిక సమాజంతో విసిగి పోయి . . తన

సహధర్మచారిణి తో సహా జైన మతసిద్ధంతాం ప్రకారం సన్యాసం దీక్ష ను స్వీకరించారు. దీంతో ఒక్కసారిగా భారత పారిశ్రామిక రంగం నివ్వెరపోయింది. 

40 ఏళ్ళ  క్రితం ఐఐటీ - బాంబేలో కెమికల్ ఇంజినీరింగ్ లో బీటెక్, ఎంటెక్ పూర్తి చేసిన ప్రకాష్ షా రిలయన్స్ ఇండస్ట్రీస్ లో వివిధ కీలక హోదాల్లో పనిచేశారు. గతేడాది వైస్ ప్రెసిడెంట్ (

ప్రాజెక్ట్స్ ) హోదాలో రిటైర్డ్ అయిన ప్రకాష్ షా ఇప్పుడు తన మిగిలిన జీవితాన్ని మరొకలా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్- 25, 2021న మహవీర్ జయంతి సందర్భంగా ప్రకాష్ షా, ఆయన భార్య నైనా షా కూడా సన్యాసం స్వీకరించారు. జైన మత సంప్రదాయం ప్రకారం గచ్చిధిపతి పండిత్‌ మహారాజ్‌ సమక్షంలో జైన తీర్థంకురులలో ఒకరైన మహావీరుడి జన్మ

కల్యాణ దినాన సన్యాస దీక్ష తీసుకున్నారు. దీక్ష తర్వాత వారి పేర్లు మారాయి. ప్రకాష్ షా దంపతుల కొత్త పేరు.. ప్రశాంత్ భూషణ్ విజయజీ మహరాజ్ సాహెబ్, భవ్యనిధి సాధ్విజీ మహరాజ్ సాహెబ్.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam