DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆగష్టు 5న దాసన్నపేటలో జగనన్న పచ్చతోరణం 

*లక్ష్యం కోటి మొక్కలు : జిల్లాకలెక్టర్ సూర్య కుమారి*

*విజయనగరం,  జులై 31, 2021 (డిఎన్ఎస్):* ఆగష్టు 5న నిర్వహించనున్న జగనన్న పచ్చతోరణం కార్యక్రమం లో కోటి మొక్కలను నాటాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగిందని, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి తెలిపారు. శనివారం కలెక్టర్  సమావేశ మందిరంలో అధికారులతో వన

మహాత్సవంపై నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ ఆగష్టు 5న దాసన్నపేట హైస్కూలులో ప్రారంబోత్సమవుతుందన్నారు. ముందుగానే గోతులు తవ్వి ఆప్రాంతాన్ని సిద్దంగా వుంచాలని ఆదేశించారు.  పచ్చతోరణంలో  భాగంగా జగనన్న కాలనీలలో, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో, గ్రామ సచివాలయాలలో,రైతు బరోసా కేంద్రాలలో, ప్రభుత్వ, ప్రైవేట్  సంస్థల

వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని సూచించారు.  మొక్కలకు అవసరమయ్యే గోతులను ముందుగా తవ్వి సిద్దం చేసుకోవాలన్నారు.    వీలువున్నంతవరకు పండ్ల మొక్కలకు ప్రాధాన్యత  యివ్వాలన్నారు.  నాటిన ప్రతీ మొక్క  బ్రతికేలా నీటి వనరులను, ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలన్నారు.   ప్రతీ మున్సిపాలిటీల్లో, ఇళ్ల ముందు,

వీధిలలో, ఖాళీగా వున్న ప్రతీ చోట మొక్కలను నాటాలన్నారు.  విద్యా శాఖ, ఆర్ అండ్ బి, జాతీయ రహదారులు, డ్వామా, వ్యవసాయ, వైద్య ఆరోగ్య, మార్కెటింగ్, హౌసింగ్, పరిశ్రమలు, పేపరు మిల్లులు, మున్సిపల్ తదితర శాఖలకు లక్ష్యాలను నిర్ణయించారు. 
    ఈ సమావేశంలో  సంయుక్త కలెక్టర్లు  డా.జి.సి.కిషోర్ కుమార్, డా. మహేష్ కుమార్,

డిఆర్ఓ గణపతిరావు, జిల్లా అటవీ అధికారి సచిన్ గుప్తా, మున్సిపల్ కమిషనర్ జె.ఎస్.వర్మ, పంచాయితీరాజ్ ఇఇ విజయ్ కుమార్, జిల్లా విద్యాశాఖాధికారి నాగమణి, నేషనల్ హైవే ప్రోజెక్టు డైరెక్టు, అటవీ శాఖ రేంజర్లు తదితరులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam