DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాస్క్ లేకుండా తిరిగే వారిపై ఏపీలో కఠిన చర్యలు 

*(DNS report : పి. రాజా, బ్యూరో చీఫ్, అమరావతి)* 

*అమరావతి, జులై 31, 2021 (డిఎన్ఎస్):* అన్ని ప్రభుత్వ, ప్రయివేట్ కార్యాలయాలు, సంస్ధలు, వ్యాపార సముదాయాలు, దుకాణాల్లో మాస్క్ లేకుండా తిరిగే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ కాటంనేని భాస్కర్ నిబంధనలు మరింత కఠినతరం చేస్తున్నారు.  ముఖానికి మాస్క్లు

లేని వారిని లోపలికి అనుమతిస్తే రూ. 10 వేల నుండి రూ.25 వేల వరకు జరిమానా విధించడం, 2- 3 రోజుల పాటు సంబంధిత సంస్థల్ని మూసివేసేలా చర్యలు తీసుకోనున్నారు. కోవిడ్ నిబంధనల్ని ఉల్లంఘించే వారి ఫొటోలను 8010968295కు వాట్సప్ చెయ్యమని పిలుపునిచ్చారు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆగస్టు 14, 2021 వరకూ కర్ఫ్యూ ఆంక్షలు అమల్లో

ఉంటాయన్నారు. నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కొవిడ్ ప్రొటోకాల్ ను తప్పనిసరిగా పాటించాల్సిందేనన్నారు. మాస్క్ లు ధరించని వారికి రూ.100 జరిమానా వైద్య ఆరోగ్య శాఖ కమీషనర్ ప్రకటించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam