DNS Media | Latest News, Breaking News And Update In Telugu

3 న మధ్యాహ్నం 2. నుంచి సింహగిరి దర్శనం రద్దు

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 02, 2021 (డిఎన్ఎస్):* ఈ నెల 3 న (మంగళవారం ) మధ్యాహ్నం 2:30 నుంచి రాత్రి  వరకు భక్తులకు దర్శనాలుండవని శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానం ఈఓ సూర్యకలా తెలిపారు. తిరిగి భక్తులకు దర్శనం 4 వ తేదీ బుధవారం ఉదయం 6:30 గంటలకు ఉంటుందన్నారు. 
సింహాచలం కొండపైన శ్రీ పాదాలమ్మ,

శ్రీ బంగారమ్మ అమ్మవార్ల పండగ  నేపథ్యంలో, కొండపైన ఘటాలు తిప్పుతారని, ఈ నేపథ్యంలో సంప్రదాయం ప్రకారం శ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామి దర్శనం మంగళవారం మధ్యాహ్నం రాజభోగం తర్వాత ఉండబోవని ఈఓ సూర్యకళ తెలిపారు. పున:దర్శనం బుధవారమేనని... అన్నీ పూర్వాచారాలు పాటిస్తున్నామని ఆమె  చెప్పారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam