DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేదాంతం రంగనాధాచార్యకు స్వర్ణకంకణ ధారణ

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 03, 2021 (డిఎన్ఎస్):* అఖిలభారత శ్రీవైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘ జాతీయ ఉపాధ్యక్షులు వేదాంతం రంగనాధాచార్య స్వామికి కర్నూలు జిల్లా ఆధోని నగరంలో దేవిరెడ్డి మారుతి చిట్ఫండ్ దశమ వార్షికోత్సవం సందర్భంగా పౌరసత్కారం,  స్వర్ణ కంకణ ధారణ మహోత్సవం ఘనంగా జరిగినది.

దీనికి అఖిలభారత శ్రీ వైష్ణవ బ్రాహ్మణ సంక్షేమ సంఘ వ్యవస్ధాపక అధ్యక్షులు వేదాంతం రంగస్వామి విశిష్ట అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు శ్రీవైష్ణవ సంప్రదాయానికి, తత్వానికి ఉదాహరణగా రంగనాధాచార్య ఉదాహరణగా వారి జీవితాన్ని మార్చుకున్నారని, అహర్నిశలు శ్రీవైష్ణవ ప్రచారానికే ప్రయత్నించారని, పాంచరాత్రాగమ

సిద్ధాంత వ్యాప్తికి కృషిచేసారని ప్రశంసించారు. జాతీయాధ్యక్షులు కొడవటిగంటి నరసింహాచార్యులు గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజీ, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్‌ కొంపల్లె వేంకట నరసింహాచార్యులు, తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌ ముడుంబై రఘువర కృష్ణమాచార్యులు, జాతీయ కార్యదర్శి (మీడియా) శాయీరామ్ చిలకమఱ్ఱి,

ఉత్తరాంధ్ర ప్రాంత కన్వీనర్ ఎస్ వెంకటాచార్యులు,  ఇతర కార్యవర్గ సభ్యులు అభినందనలు తెలియచేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam