DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ దేవాదాయశాఖ డీసీపై సిబ్బంది ముందే ఏసీ దాడి

*డీసీ ఛాంబర్లో ఏసీ శాంతి దుర్భాషలతో శాపనార్ధాలు*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 05, 2021 (డిఎన్ఎస్):* ప్రభుత్వ రంగ సంస్థల్లో సిబ్బంది క్రమశిక్షణ తప్పితే చర్యలు తీసుకోవాల్సిన అధికారులే క్రమశిక్షణ తప్పితే. . .  వినడానికే ఎబ్బెట్టుగా  ఉంది. సరిగ్గా ఇలాంటి ఘటనే విశాఖపట్నం దేవాదాయ

శాఖా ఉప కమిషనర్ (డీసీ)  కార్యాలయంలో అయన ఛాంబర్ లోనే గురువారం జరిగింది. ఉదయం 11 గంటల  సమయంలో డీసీ పుష్పవర్ధన్ క్రింద స్థాయి సిబ్బందితో మాట్లాడుతున్న సమయంలో సహాయ కమిషనర్ కె. శాంతి ఒక్కసారిగా ఛాంబర్ లోకి వచ్చి డీసీ ముఖం పై ఇసుక తో దాడి చేసి, దుర్భాషలాడడంతో ఒక్కసారిగా అందరూ విస్తుపోయారు. ఇంకెవరికి మాట్లాడే అవకాశం

ఇవ్వకుండా ఆమె చెప్పవలసిన విషయం చెప్పేసి, వెళ్లిపోయారు. 

దీంతో కొన్ని రోజులుగా అంతర్గతంగా జరుగుతున్న విభేదాలు రోడ్డుమీదకు వచ్చాయి. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అవ్వడం గమనార్హం. ఆ ఘటన జరిగిన సమయంలో డీసీ కార్యాలయ సీనియర్ సిబ్బంది, ఈఓ లు కూడా అక్కడే ఉన్నారు. ఆమె ప్రవేశించడం, ఆపై ఏమి జరుగుతోందో అందరూ

తెలుసుకునే లోపే ఇసుక దాడి, దుర్భాషలు అన్ని ముగిసిపోయాయి. 
అంతర్గతంగా విభేదాలు ఉన్నట్టయితే ఏసీ నేరుగా కమిషనర్ కార్యాలయాన్ని ఫిర్యాదు చేసే అవకాశం ఉంది. అయినప్పటికీ ప్రత్యక్ష దాడికి దిగడం వెనుక ఏమి జరిగిందో తెలియాల్సి ఉంది. గతం లో జరిగిన ఘటనలలో తనని బలి పశువును చేస్తున్నారంటూ శాంతి ఆవేదన చెందడం తెలుస్తోంది.

అయితే ప్రధాన కార్యాలయం అధికారుల విచారణలో పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam