DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ దేవాదాయశాఖ ఏసీపై చర్యలకు డీసీ ఫిర్యాదు

*మనోవేదన భరించలేక కొట్టలేకే. .ఇలా. .:  ఏసీ శాంతి*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 05, 2021 (డిఎన్ఎస్):* విశాఖపట్నం దేవాదాయ శాఖా ఉప కమిషనర్ (డీసీ)  కార్యాలయంలో గురువారం తనపై దాడి చేసిన ఘటన లో సహాయ కమిషనర్ కె. శాంతిపై చర్యలు తీసుకోవాలినదిగా డీసీ పుష్పవర్ధన్ కమిషనర్ కు ఫిర్యాదు చేసారు.

గురువారం ఉదయం 11 గంటల  సమయంలో డీసీ పుష్పవర్ధన్ క్రింద స్థాయి సిబ్బందితో మాట్లాడుతున్న సమయంలో ఏసీ శాంతి ఛాంబర్ లోకి వచ్చి డీసీ ముఖం పై ఇసుక తో దాడి చేసి, దుర్భాషలాడిన విషయం తెలిసిందే. ఈ ఘటన బాధాకరమన్నారు. క్రింది స్థాయి సిబ్బంది ఎదుట తనను క్రిందిస్థాయి అధికారి అవమానించడం పై తీవ్రంగా పరిగణించాలని

కోరారు. 

ఆడపిల్లగా కొట్టలేక తిట్టలేక అలా : ఏసీ శాంతి 

గతంలో ఉన్న వ్యక్తిగత విభేదాలను సీరియస్ గా తీసుకుని డిప్యూటి కమీషనర్ తనను మానసికంగా సాధిస్తున్నారని సహాయ కమిషనర్ శాంతి ఆవేదన వ్యక్తం చేసారు. మెంటల్ హెరాస్ మెంట్ ఉంటే ఆడపిల్లగా నేను ఇక్కడ పనిచేయాలేనని, ముందుగా నేను ఒక ఆడపిల్లను ఆ తర్వాతే

ఉద్యోగిని అన్నారు.  ఆడపిల్లగా కొట్టలేక తిట్టలేక అలా చేసానని తెలిపారు. గతంలోనే ఆయనపై ఆర్.జె.డి కి ఫిర్యాదు చేసానని, విచారణకు ఆయన రాలేదు అడ్వకేట్ తో వస్తానని ఆర్.జె.డి కి సమాధానం చెప్పారన్నారు. డీసీ పుష్పవర్దంపై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నాయని, నేను ఎవరితో కలిసి వర్క్ చేశానో వారిని నోటీస్ లు ఇవ్వకుండా సస్పెండ్

చేశారు. వివాదాలు ఏమి లేకుండా పేపర్లలో వార్తలు రాయించారని ఆవేదన వ్యక్తం చేసారు. 
ఏసీగా నా విధులను అడ్డుకోవడమే కాదు మనిషిగా కూడా గుర్తించడం లేదని, డీసీపై క్రిమినల్ కేసు ఫైల్ చేస్తానని తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam