DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారత హాకీ విజయానికి వెనుక అండదండగా నవీనుడే

*పూర్తి స్పాన్సరర్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్కే*

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 05, 2021 (డిఎన్ఎస్):* టోక్యో ఒలంపిక్స్ లో 41 ఏళ్ళ తర్వాత భారత్ పురుషుల హాకీ జట్టు అద్భుతమైన ప్రతిభతో.. ఒలంపిక్స్ లో ఒక పతకం సాధించింది. ఈ కాంస్య పతకం కోసం జరిగిన పోరులో భారత్ టీం – జర్మనీతో తలపడింది.

హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది భారత హాకీ టీం. 
అయితే ఈ జట్టుకు దేశవ్యాప్తంగా అభినందనలు చెప్తున్నారు. అయితే ఈ జట్టు విజయం వెనుక అండగా నిలిచి అత్యంత కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్. 

గత కొన్నేళ్లుగా భారత హాకీ చరిత్ర చూసిన ప్రధాన

స్పాన్సరర్ సహారా 2018 సంవత్సరం లో   అర్దాంతరంగా తప్పుకోవడంతో, అగమ్య గోచరంగా ఉన్న భారత్ పురుషుల, మహిళా హాకీ జట్లకు ఆసరాగా నిలబడమంటూ భారత హాకీ ఫెడరేషన్ ఎన్నో కార్పొరేట్ కంపెనీలను అప్రోచ్ అయ్యింది. ఎవరూ ముందుకు రాలేదు. హాకీ జట్టు గెలిచేది లేదూ చచ్చేదీ లేదు. పైగా హాకీ మ్యాచ్ లు చూసేది ఎవరు అంటూ ఎగతాళి చేశాయి కార్పొరేట్

కంపెనీలు.

ఈ విపత్కర పరిస్థితుల్లో భారత పురుషుల, మహిళా జట్లకు అండగా నిలిచేందుకు నవీన్ పట్నాయక్ రంగంలోకి వచ్చారు. ఆయన తొలినాళ్లలో హాకీ క్రీడాకారుడు కావడంతో, దేశం మొత్తం పట్టించుకోని వేళ ఎంతో ఆవేదన చెంది, ఈ జట్ల ప్రోత్సాహానికి రూ. 100 కోట్లను కేటాయించారు. ఈ కాంట్రాక్ట్ 2023 వరకూ కొనసాగుతుంది.

  

కెప్టెన్ మన్ ప్రీత్ సేన భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించింది. 
41 ఏళ్ల క్రితం మాస్కో ఒలంపిక్స్ తర్వాత ఒలంపిక్స్ లో హాకీలో పతకం రావటం ఇదే.. అందరూ భారత హాకీ జట్టుకు శుభాకాంక్షలు చెబుతున్నారు.. కీర్తిస్తున్నారు.. తెర వెనక హాకీ జట్టుకు సపోర్ట్ చేసింది.. ప్రోత్సహించిన వ్యక్తి ఒకరు ఉన్నారు.. ఆయనే

ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్. 

క్రీడాకారులకు కావాల్సిన అన్ని వసతులను కల్పించటానికి అవసరం నిధులు ఆయన సమకూర్చారు. 2023 సంవత్సరం వరకు భారత పురుషులు, మహిళల హాకీ జట్లకు అవసరం అయిన అన్ని ఖర్చులు భరించటానికి ముందుకు వచ్చారు. అతను ఆ రోజు ఆదుకోకపోయి ఉంటే ఇవాళ భారత జట్టు ఇంతలా ప్రదర్శన ఇచ్చేదా.. ప్రాక్టీస్ చేసేదా..

చెప్పండి. నీ దగ్గర టాలెంట్ ఉండటమే కాదు.. అందుకు తగిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం లేకపోతే మెడల్ ఎలా వస్తుంది..

ఇవాళ భారత హాకీ జట్టును ఆకాశానికెత్తుతున్న కార్పొరేట్ కంపెనీలు గానీ, సెలబ్రిటీలు గానీ . హాకీ జట్లకు అవసరమైన సమయంలో ఒక్కరయినా ముందుకు వచ్చారా లేదు కదా.. ఇప్పుడు . .. హాకీ జట్టు భారత్ కు తిరిగి రాగానే తన

బ్రాండ్ల ప్రమోషన్ కోసం.. కోట్లు కుమ్మరిస్తాయి.. అది కూడా ఎంతో దూరంలో లేదు.. జస్ట్ నాలుగు ఐదు రోజుల్లోనే.. 

ఇంత సహకారం చేసినా ఏ ఒక్క రోజూ నవీన్ పట్నాయక్ ఎక్కడా తన పేరు గానే, ఒడిశా ప్రభుత్వం గురించి గానీ ప్రకటించుకోలేదు. పైగా ఈ రోజు ఇంత అద్భుత విజయం సాధించిన సమయంలో కూడా ఆయన ఎక్కడా తన సహకారం గురించి నోరు

విప్పింది లేదు. సగటు భారతీయుని లాగానే ఆయన కూడా చప్పట్లు కొడుతున్నారు జై భారత్ అంటూ. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam