DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కేంద్ర పథకాల ప్రచారంలో బీజేపీ ఫ్లాప్, జగన్ టాప్

   
*బీజేపీ వైఫల్యాన్ని క్యాష్ చేసుకుంటున్న వైకాపా నేతలు*

*కేంద్ర పథకాలపై జగన్ బొమ్మ పై బీజేపీ నేతల బీద అరుపులు* 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)*

*విశాఖపట్నం, ఆగస్టు 05, 2021 (డిఎన్ఎస్):* కేంద్ర ప్రభుత్వం రాష్టానికి కేటాయించిన పథకాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పేరు, ఫోటోలు

వేసుకోడాన్ని అడ్డుకోవడంలో ఆంధ్ర ప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఘోరంగా దెబ్బతింది. గత రెండేళ్లుగా కేంద్రం విడుదల చేస్తున్న ప్రతి పధకం పైన వైఎస్ జగన్ తన పేరు పెట్టుకోవడమే కాక, ప్రధాని ఫోటో కాకుండా తన ఫోటో పెట్టడాన్ని మొదటి నుంచి బీజేపీ తప్పుపడుతున్నాయి,  ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చెయ్యడంలో బీజేపీ నేతలు అట్టర్

ఫ్లాప్ కొట్టారన్నది వాస్తవం. అయితే ముందుగానే కోలుకోవాల్సిన బీజేపీ నేతలు, క్యాడర్ ఇన్నాళ్లు మొద్దు నిద్రపోవడంతో ఈ అద్భుతమైన అవకాశాన్ని అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంది. ప్రతి పధకం పై తన photo
వేసుకుంటున్నారు. ఆఖరికి పేదలకు ఉచితంగా ఇచ్చే బియ్యం పధకాన్ని కూడా జగన్ తన ఖాతాలో వేసుకోవడంతో

కేంద్రం రంగంలోకి దిగింది, కొరోనా మహమ్మారి కరోనా కాలంలో పూర్తిగా ఉచితం గా బియ్యం సహా ఇతర దినుసులు అన్ని ఉచితంగానే కేంద్రం ఇచ్చింది. దీన్ని ఏకంగా ఒక వ్యాన్ లోఆ ఇంటింటికీ వచ్చి, ప్రచారం చేసుకోవడంతో ఈ సరంజామా అంత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. కేంద్రం ఇచ్చిన షాక్ తో రాష్ట్రానికి రెండు 
లెటర్ లు వ్రాసింది. దీంతో కేంద్రం

ఇచ్చే బియ్యం, గోధుమలు త్రం రేషన్ దుకాణాల వద్దే పంపిణి చేస్తున్నారు. ఇక మిగిలిన సర్వశిక్షా అభియాన్, అంగన్వాడీ పాఠశాలలు పూర్తిగా కేంద్రం నిర్వహణలో సాగుతున్నాయి. వాటికి ఇచ్చిన నిధులను ప్రక్కదారి పడుతుంటే బీజేపీ నేతలు మీడియా కెమెరాల ముందు బయ్ మానడం తప్ప ప్రజా క్షేత్రంలో ప్రచారం చేసుకోవడం లో ఘోరంగా విఫలం

చెందింది. 
సాక్షాత్తు రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజే జగన్ ధాటికి బేజారెత్తిపోతున్నారు. ఏ మీడియా సమావేశం చూసుకున్న కేంద్ర పథకాలకు జగన్ బొమ్మ వేసుకుంటున్నాడు అంటూ గగ్గోలు పెట్టడం తప్ప, ప్రజల దగ్గరకు వెళ్లి కేంద్ర పధకాలు గురించి, ఏ ఏ పథకాలకు ఎంత నిధులు ఇస్తున్నారు,,. రాష్ట్ర ప్రభుత్వం వాటిని తన ఖాతాలో ఎలా

వేసుకుంటాడో చెప్పడానికి మాత్రం ఒక్క  నాయకుడు సైతం ముందుకు రాని స్థితి. ఇదే అదనుగా వచ్చిన అవకాశాన్ని వైకాపా తనవైపు తిప్పుకుంటోంది. 
రాష్టంలో 90 శాతం పథకాలు అన్నీ కేంద్రం ఇచ్చినవేనని, నిధులు కూడా పుష్కలంగా ఇస్తోందన్నారు. ఉచిత రేషన్, సర్వ శిక్ష అభియాన్, జల రక్షా, తదితర అన్ని పథకాలపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇవేవో

రాష్ట్ర ప్రభుత్వ సొంతంగా పెట్టుకున్న పథకాలుగా మార్చేసి, అన్ని పథకాలకు ముందు జగనన్న పేర్లు పెట్టేసి, జగన్ ఫోటోలు వేసేసి, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam