DNS Media | Latest News, Breaking News And Update In Telugu

45 ఏళ్ళు దాటితే వేక్సిన్ వేసుకోవాలి: సబ్ కలెక్టర్ భావన

*విజయనగరం / విశాఖపట్నం, ఆగస్టు 06, 2021 (డిఎన్ఎస్):* కరోనా కట్టడికి వెక్షినేషన్ తప్పనిసరి, 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా  వెక్షినేషన్ చేయించుకోవాలి, వెక్షినేషన్ పై అపోహలు విడండి అని విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్ కలెక్టర్ భావన పేర్కొన్నారు.
కరోనా కట్టడిలో భాగంగా శతశాతం వెక్షినేషన్ స్పెషల్ డ్రైవ్

పార్వతీపురం డివిజన్ లో పార్వతీపురం మండలం ములగ, మక్కువ మండలం తురుమామిడి పంచాయతీలో శుక్రవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ ప్రక్రియలో నిర్దేశిత గ్రామ పంచాయతీలలో 45 సంవత్సరాల వయస్సు పై బడి ఉన్న వారికి వెక్షినేషన్ స్పెషల్ డ్రైవ్ ఉదయం ప్రారంభించారు. ములగ పంచాయతీలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సబ్ కలెక్టర్ భావన

పర్యవేక్షించి, నిర్వహిస్తున్న వెక్షినేషన్ పై ఆరా  తీశారు. అనంతరం సబ్ కలెక్టర్ మాట్లాడుతూ 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ విధిగా వెక్షినేషన్ చేయించుకోవాలని, వెక్షినేషన్ పై చాలా మందికి అపోహలు ఉన్నాయి, అపోహలు విడి వెక్షినేషన్ చేయించుకొని కరోనా కట్టడికి అందరూ సహకరించాలన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam