DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాస్క్ లేకుండా జనం ఉన్న లక్కీ షాపింగ్ కు 15 వేలు ఫైన్

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 06, 2021 (డిఎన్ఎస్):* కొరోనా రెండవ దశ ప్రభావం పూర్తి పోనందున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కోవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తోంది. దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇచ్చినా. . మాస్క్ లేకుండా ఖాతాదారులను లోనికి రాణిస్తే. . దుకాణుదారునకు రూ. 15 వేలు ఫైన్ వేస్తామని

ప్రకటించింది. ఈ క్రమంలో మహా విశాఖ నగరంలో మొదటి ఫైన్ పడింది. విశాఖలోని లక్కీ షాపింగ్ మాల్ లో మాస్క్ లేకుండా జనం ఉండడంతో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఈ నెల 5 వ తేదీన ఫైన్ వేయడం జరిగింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లేకుండా తిరిగే జనానికి కూడా రూ. 100 జరిమానా వేయనున్నారు. ఆషాఢ మాసం సేల్స్ కోసం నగరం

లోని దుకాణాలు వివిధ పధకాలు, డిస్కౌంట్లను ప్రవేశ పెట్టడం తో కోవిడ్ నిబంధనలకు తిలోదకాలిచ్చి మరీ జనం దుకాణాల్లోకి చేరిపోతున్నారు. దీని ద్వారా. . .రెండో దశ మరింత విస్తరించనుండడంతో కొరడా ఝుళిపిస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam