DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్ సస్పెండ్ 

*సింహగిరి భూముల్లో అవకతవకలు, ఏఈవో కూడా సస్పెండ్*  

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 06, 2021 (డిఎన్ఎస్):* విధుల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై దేవదాయ ధర్మాదాయ శాఖ అదనపు కమిషనర్ రామచంద్ర మోహన్, సింహాచలం దేవస్థానం ఏఈవో ఎన్. సుజాత లను సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ ముఖ్యకార్యదర్శి జి.

వాణి మోహన్ ఆదేశాలు జరీచేసారు. విశాఖపట్నం నగరం లోని శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం, సింహాచలం, పూసపాటి రాజాస్థానానికి చెందిన మాన్సాస్ భూముల వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై నాటి ఆలయ ఈఓ కే. రామచంద్ర మోహన్, జిల్లా సహాయ కమీషనర్ ఎన్. సుజాత లను సస్పెండ్ చేసారు. 

ఈ భూములకు సంబంధించి దేవదాయ

ధర్మాదాయ శాఖ విశాఖపట్నం ఉపకమిషనర్ ఈ. వి. పుష్పవర్ధన్ సభ్యులుగా ఉన్న త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ఇచ్చిన నివేదిక ఆధారంగా రామచంద్ర మోహన్ పై సస్పెన్షన్ వేటు పడింది. ఇదివరలోనే ఆయనను దేవదాయ శాఖ ప్రభుత్వానికి సరెండర్ చేసిన సంగతి తెలిసిందే. ఈ భూములు. కాపాడ్డంలో భాద్యతలు సక్రమంగా నిర్వర్తించని కారణంగా సుజాతపై వేటు

వేసినట్టు తెలిపారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam