DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాకినాడ పిల్ సంస్థ చే 160 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 10, 2021 (డిఎన్ఎస్):* కోరోనా మహమ్మారి ప్రభావ సమయంలో ఉపాధి కోల్పోయిన  160 అతిసామాన్య కుటుంబాలకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కు చెందిన పైప్ లైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ (పిల్ ) బృందం నిత్యావసరాలు పంపిణి చేసినట్టు సంస్థ సీనియర్ జనరల్ మేనేజర్ ఎన్.

సిహెచ్. రామనరసింహం తెలియచేసారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత లో భాగంగా తమ సంస్థ ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తోందని, గత ఏడాది కాలం లో కొరోనా ప్రభావం అధికంగా ఉండడంతో ఉపాధి కోల్పోయిన కుటుంబాలకు తమ వంతు సహకారం నిత్యావసరాల ఆహారధాన్యాలు పంపిణీ చేపట్టామన్నారు. 

తూగో జిల్లా కాజులూరు మండలం తిప్ప రాజుపాలెం

గ్రామంలో మొత్తం రూ. 4 లక్షల 60 వేల వ్యయం తో 160 కుటుంబాలకు సామాగ్రిని అందించారు. మరో మూడు రోజుల్లో మరో మూడు గ్రామాలలో ఈ పంపిణీ కార్యక్రమం చేపట్టనున్నట్టు తెలిపారు. 

ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు బాజీ వలి,  పవన్ కుమార్,  మీరయ్య,  ధర్మారావు, వాల్మీకి, పాండ తదితరులు పాల్గొన్నారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam