DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నిర్మల పర్యటన ద్వారా బయటపడ్డ రాష్ట్ర బీజేపీ డొల్లతనం.

కేంద్ర పథకాలపై ప్రధాని బొమ్మ ఎందుకు లేదు?: కేంద్రమంత్రి 

జగన్ బొమ్మపై ప్రశ్నించాలంటే కేంద్ర ఆర్ధిక మంత్రి రావాలా?

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 10, 2021 (డిఎన్ఎస్):* కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న నిధులతో జరుగుతున్న పథకాలపై ప్రధానమంత్రి బొమ్మ కాకుండా ముఖ్యమంత్రి వైఎస్

జగన్ మోహన్ రెడ్డి బొమ్మ వేసుకోడాన్ని ప్రశ్నించడానికి సాక్షాత్తు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రావాల్సిన పరిస్థితి వచ్చిందా అంటే అవుననే చెప్పాలి. ఇదే విషయం రెండు రోజుల క్రితం నిర్మల పర్యటనలో తేలింది. అనకాపల్లి లో ఒక పౌరసరఫరాల దుకాణాన్ని పరిశీలించిన కేంద్రమంత్రి స్థానిక ఎమ్మెల్యే అధికార వైఎస్సార్

కాంగ్రెస్ పార్టీ కి చెందిన గుడివాడ అమర్ నాధ్ ను నిలదీయారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన పధకాలు ఏంటో చెప్పాలని ప్రశ్నించి అతనిచేతి సమాధానం చెప్పించినట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఉచిత బియ్యం పధకాన్ని ప్రస్తావిస్తూ . . . పూర్తిగా కేంద్రం ప్రజలకు ఉచితంగా బియ్యం సహా ఇతర సామాగ్రి ఇస్తోందని, ఈ పథకాలపై మీ సీఎం ఫోటో వేసుకుంటే

అభ్యంతరం లేదు, కానీ దేశానికి పెద్దోడు ( ప్రధాని మంత్రి ) ఫోటో ఎందుకు వెయ్యలేదో చెప్పాలన్నారు. వాక్సిన్ ఖర్చు పూర్తిగా  కేంద్రమే భరిస్తోందని ఆర్ధిక మంత్రి తెలిపారు. 

ప్రచారం రాష్ట్ర బీజేపీ అట్టర్ ఫ్లాప్ . ..

కేంద్రం రాష్ట్రానికి ఇస్తున్న పధకాలను ప్రచారం చెయ్యడంలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం అట్టర్

ఫ్లాప్ అయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల పర్యటనలో తేలిపోయింది. కేవలం జగన్ బొమ్మ పైనే ప్రశ్నించలేని నాయకులూ, కేంద్ర పధకాలను ఎంత బాగా ప్రచారం చేస్తున్నారో ఆమె దృష్టికి వచ్చాయి. ఒక్క విషయంలోనే నిలదియ్యలేని వాళ్ళు రానున్న కాలంలో రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ఎలా ప్రకటిస్తున్నారో వాళ్ళకే తెలియాల్సి ఉంది.

తనని కలిసిన రాష్ట్ర బీజేపీ నేతలకు కేంద్ర మంత్రి పెద్ద క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam