DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో అమిత్ ఆనందం

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 12, 2021 (డిఎన్ఎస్):* శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లిఖార్జున స్వామి దర్శనానికి కేంద్ర హోంశాఖామంత్రి అమిత్ షా కుటుంబ సమేతం గా విచ్చేసారు. గురువారం ఉదయం హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన.. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో శ్రీశైలం చేరుకున్నారు.

కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన అమిత్‌షాకు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఆలయ అధికారులు, ఇతర ప్రజాప్రతినిధులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. అనంతరం స్వామి, అమ్మవార్లను అమిత్‌షా దర్శించుకున్నారు. అమిత్‌షా పర్యటన నేపథ్యంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

చేశారు.

అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించటం జరిగింది.

భారతీయ జనతా పార్టీ యువమోర్చ ప్రధాన కార్యదర్శి డా. శబరీ రాజశేఖర్, ఇతర బీజేపీ నాయకులూ అమిత్ షా ను కలిసిన వారిలో ఉన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam