DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ద్వారకా తిరుమల ఏఈఓ మృతికి ఈఓ వేధింపులే కారణమా?

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 13, 2021 (డిఎన్ఎస్):* పశ్చిమ గోదావరి జిల్లా ద్వారకా తిరుమల ఆలయంలో అత్యంత ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. ఆలయ ఈఓ  వేధింపులకు తట్టుకోలేక ఏఈఓ ఆచార్యులు మృతి చెందినట్టు ఆలయ ఉద్యోగులు, కుటుంబ సభ్యులు, భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల దేవాదాయ శాఖలో అధికార దర్పం తో ఈఓ లు

క్రిందిస్థాయి ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిళ్ల కు గురి చేస్తున్నారు.  నెలవారీ టార్గెట్లను అమలు చేస్తూ క్రింది స్థాయి ఉద్యోగులకు మనశాంతి లేకుండా చేస్తున్నారంటూ గత కొన్నాళ్లుగా ఆలయ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ విషాదానికి గల పూర్వాపరాలు, వివరాలు కేవలం అయన కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియడంతో

వాళ్ళు వివరించే వరకూ వేచి చూడాల్సి ఉంది. బాధిత ఆచార్యుల సోదరుడు  కూడా ఇదే ఆలయం లో గోశాల పరిరక్షణ విభాగం లో విధులు నిర్వర్తిస్తున్నారు. 

ఈ ఘటనపై విచారణకు దేవాదాయ శాఖా ఇద్దరు అధికారులను (రాజమహేంద్రవరం ప్రాంతీయ సంయుక్త కమిషనర్, రెండవ వారు ఉప కమిషనర్ ) ద్వారకా తిరుమలకు పంపినట్టు సమాచారం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam