DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీరమ్య తిరుమలలో అమ్మవారి కళ్యాణం లో పాల్గొనండి 

వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని జన్మ ధన్యత చెందండి

*(DNS report : వెంకటాచార్యులు S, బ్యూరో చీఫ్, శ్రీకాకుళం)* 

*శ్రీకాకుళం, ఆగస్టు 14, 2021 (డిఎన్ఎస్):* అత్యంత పవిత్రమైన శ్రావణ మాసం లో జరుగుతున్న మహాలక్మి అమ్మవారి కళ్యాణం లో పాల్గొని జన్మ ధన్యత చెందాలని శ్రీరమ్య తిరుమల అర్చకులు కరి రంగనాధ

వేణుమాధవాచార్యులు ఆహ్వానిస్తున్నారు. శ్రీకాకుళం - అరసవల్లి రోడ్ లోని శ్రీ రమ్య ఆలయంలో శనివారం ఆగస్టు 14 న మహాలక్ష్మి అమ్మవారి 3 వ వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం ఉదయం 7 గంటల నుంచి నవ కలశ స్నపన తిరుమంజనం, అలంకారం, మహాలక్ష్మి హోమం, అనంతరం పూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారి వార్షిక

కల్యాణోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు వివరించారు. శనివారం సాయంత్రం జరిగే ఈ కళ్యాణం లో పాల్గొనడం పూర్వ జన్మ సుకృతమని, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని జనా ధన్యత పొందాలని ఆహ్వానించారు. ఆలయానికి వచ్చే ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలను తప్పని సరిగా పాటిస్తూ, ముఖానికి మాస్క్ ధరించాలని, భౌతిక దూరం

పాటించాలన్నారు.  

నెల రోజుల పాటూ శ్రావణ మాసోత్సవాలు. . .

ఎంతో పవిత్రమైన శ్రావణ మాసం నెలరోజుల పాటూ వైభవోపేతంగా ఆలయంలో శ్రీ వేంకటేశ్వరునికి, మహాలక్ష్మి అమ్మవారికి నిత్యా ఆరాధనలు, అభిషేకాలతో పాటు, ప్రతి రోజు కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్టు అర్చకులు తెలియచేసారు. దూర ప్రాంతంలో ఉండే భక్తులు తమ గోత్ర

నామాలను,  ఆలయ వాట్సాప్ నెంబరు +91 9440061940  కు పంపాలని సూచించారు, ప్రసాదాన్ని పోస్ట్ ద్వారా భక్తులకు పంపడం జరుగుతుందన్నారు. 

వైభవంగా పునర్వసు రామాయణ పారాయణ. .

సమాజాన్ని పట్టి పీడిస్తున్న కొరోనా మహమ్మారి రాక్షసుని బారి నుంచి మానవాళికి పూర్తి ఉపశమనం లభించాలి అని కోరుతూ గత జులై నెల పునర్వసు నక్షత్రం

నుంచి ఈ నెల 5 వరకూ ( పునర్వసు ) శ్రీమద్రామాయణ పారాయణ అకుంఠిత దీక్షతో సాగించినట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam