DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సప్తఋషి వేదపాఠశాలలో 75 వ స్వాతంత్య్ర దిన వేడుకలు 

*(DNS report : Sairam CVS, బ్యూరో చీఫ్, Vizag)* 

*విశాఖపట్నం, ఆగస్టు 15, 2021 (డిఎన్ఎస్):* భారత దేశ 75 వ స్వాతంత్య్ర దిన వేడుకలు విశాఖ లోని సప్తఋషి వేదపాఠశాలలో వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం జరిగిన వేడుకల్లో పాల్గొనేందుకు ముఖ్య అతిధిగా ఆంధ్ర ప్రదేశ్ బ్రాహ్మణా కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా

వేదఘోష, గో ధూళి ప్రసరించే ప్రాంతమంతా ఎంతో సుభిక్షంగా ఉంటుందని పురాణాలూ, సనాతన హైందవ ధర్మం తెలియచేస్తోందన్నారు. ఎంతో శ్రమకోర్చి వేద విజ్ఞానాన్ని అందిస్తున్న సప్త ఋషి చారిటబుల్ సంస్థ నిర్వాహకులు మావిళ్ళపల్లి మాధవశర్మ, బృందాన్ని అభినందించారు. అనంతరం ఆశ్రమం ప్రాంతం లోని తరగతి గదులను, గోశాలను, పరిశీలించారు. అంతకు

ముందు జాతీయ జండాను ఎగుర వేసి, వందనం సమర్పించారు. వేద విద్యార్థులు, ఆశ్రమ వాసులు అందరూ జాతీయ గీతాన్ని ఆలపించారు. సమస్త భారతావని, ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన సాధారణ జీవితాన్ని గడపాలని కోరుతూ వేదాశీర్వచనం చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam